ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పథకాల అమలుకు కృషి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 2019 శాసనసభ ఎన్నికలలో 86 శాతం సీట్లు, 50 శాతం ఓట్లు సంపాదించుకొని అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంది. ఆయన పాలనలో విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేయటం ద్వారా సంక్షేమ ప్రభుత్వఫు ప్రాధామ్యాలు స్పష్టమయ్యాయి.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనపై వ్యాసాలకు ఆహ్వానం పలుకుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అమ్మ ఒడి, ఆంగ్ల మాధ్యమం, వాలంటీర్ల వ్యవస్థ, రైతుభరోసా, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, వాహనమిత్ర, వసతి దీవెన, విద్యా దీవెన… ఇలా ప్రభుత్వం సాధించిన పనితీరును విశ్లేషించాలి. ఈ వ్యాసాలు తెలుగులో ఉండాలి. 500–800 పదాల మధ్య ఉండాలి. వాట్సప్లో లేదా పేజ్ మేకర్ 7.0 లేదా యూనికోడ్లో టైపు చేసిన ఓపెన్ డాక్యుమెంట్లు మాత్రమే పంపించాలి.
ఎన్నుకోబడిన 20 మంచి వ్యాసాలే కాకుండా మంచి విశ్లేషణ గల మరో 20 వ్యాసాలను కలిపి పుస్తకంగా ప్రచురించడం జరుగుతుంది. ఇక మొదటి (రూ.10 వేలు), రెండు (రూ.5 వేలు), మూడు (రూ.3 వేలు), నాలుగు (రూ.2 వేలు), ఐదు (రూ.1000) బహుమతులతోపాటు ప్రచురించిన ప్రతి వ్యాసానికీ రూ. 1000 ఇస్తాం. బహుమతి ప్రదానం పుస్తకావిష్కరణ రోజే ఉంటుంది. వ్యాసాలు పంపడానికి ఆఖరు తేదీ: 2022 ఏప్రిల్ 30. పంపాల్సిన వాట్సాప్ నంబర్: 9393111740. ఈ–మెయిల్: srdalitsocialmedia@gmail.com