అమ్మఒడి పథకం డబ్బులు ఇంకా జమకాని లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ తేదీలోగా డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెండింగ్ పేమెంట్స్ జమచేస్తామని ప్రభుత్వం తెలిపింది.
ప్రతి ఒక్కరు చదువుకోవాలని, చదువు పిల్లల తల్లిదండ్రులకు భారం కాకూడదని భావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకునేందుకు పలు పథకాలను ప్రవేశపెట్టింది. పేదరికాన్ని రూపుమాపడానికి చదువు ఒక్కటే మార్గమని తెలిపింది. ఆ దిశగా అడుగులు వేస్తూ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశ పెట్టింది. స్కూల్లను నేటి కాలానికి తగినట్లుగా ఆధునీకరించారు. ఈ క్రమంలో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే పిల్లల తల్లులకు అమ్మఒడి పథకాన్ని తీసుకు వచ్చిది. దీనిలో భాగంగా రూ. 15వేల రూపాయలను తల్లుల ఖాతాల్లో జమచేస్తున్నది ప్రభుత్వం. కాగా నాలుగో విడతకు సంబందించి నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం. అయితే కొంతమందికి ఖాతాలో నగదు జమ కాగా మరికొందరికి పడలేదు. డబ్బులు పడని వారికి ప్రభుత్వం శుభవార్తను అందించింది.
జగనన్న అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏటా రూ. 15వేల రూపాయలను ప్రభుత్వం జమచేస్తున్నది. కాగా నాలుగో విడతలో రూ. 15వేలల్లో, రెండు వేలరూపాయలను స్కూల్లు, మరుగుదొడ్ల నిర్వహణ నిధికోసం మినహాయిస్తున్నారు. కాగా జూన్ 28న సిఎం జగన్ అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. అయితే కొంత మంది ఖాతాల్లో డబ్బలు జమ కాగా, మరికొంత మందికి జమ అయినట్లు స్టేటస్ చూపించినా ఖాతాలో డబ్బులు పడలేదు. ఇప్పటి వరకు డబ్బులు జమకాని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీనికి సంబందించి జూలై 10నుంచి 16వ తేదీ వరకు అకౌంట్ లలో జమ అవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ వారంలోగా పెండింగ్ పేమెంట్స్ ఖాతాల్లో జమ అవుతాయని ప్రభుత్వం వెల్లడించింది.