మనిషిని ప్రమాదం ఎటు నుంచి పొంచి ఉంటుందో ఎవరూ ఊహించలేదు. ఈ మద్య గుండెపోటు మరణాలు, రోడ్డు ప్రమాదాలు, పాము కాటుతో మరణించిన ఘటనలు ఎన్నో జరిగాయి.
ప్రమాదాలు ఎప్పుడు ఎలా పొంచి ఉంటాయో ఎవరూ ఊహించలేం. అప్పటి వరకు మన మధ్య ఉన్నవాళ్లు అకస్మాత్తుగా ప్రమాదానికి గురై ఆస్పత్రిపాలైన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పాముకాటుకు గురికావడంతో హుటాహుటిన ఆయను ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే..
చీరాల మాజీ ఎమ్మెల్యే, బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ పాముకాటుకు గురయ్యారు. ఆయన ఇంటి వెనుక నర్సరీలో వాకింగ్ చేస్తూ ఉండగా పాము కరిచింది. ఇది గమనించిన సిబ్బంది ఆయను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆరు గంటల పాటు అజ్జర్వేషన్ ఉండాల్సిందిగా వైద్యులు తెలిపారు. ఆయనకు మెరుగైన చికిత్స కోసం మణిపాల్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
ఆమంచి కృష్ణ మోహన్ బాపట్ల జిల్లా చీరాల నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఇంటిపెండెంట్ అభ్యర్థిగా గెలిచారు. ప్రస్తుతం ఆయన పర్చూరు వైసీపీ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారు ఆమంచి. ఇదిలా ఉంటే ఈ మద్యనే ఆయన సోదరుడు ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆమంచి కృష్ణ మోహన్ పాముకాటుకు గురయ్యారన్న వార్తతో తెలియడంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. ఆయనను పరామర్శించేందుకు కీలక నేతలు ఆస్పత్రికి తరలివస్తున్నారు.