టాలీవుడ్ అగ్రహీరో పవన్ కళ్యాణ్ తన నటనతో, యాటిట్యూడ్ తో అశేషమైన అభిమానులను సంపాదించుకున్నారు. సినిమాల్లో హీరోగానే కాకుండా నిజ జీవితంలో కూడా పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్క్ నటనతో, యాటిట్యూడ్ తో స్టార్ హీరోగా వెలుగొంది, అభిమానులకు ఆరాద్య నటుడిగానే కాకుండా ఆరాద్య దైవంలా మారారు పవన్ కళ్యాణ్. విలక్షణమైన వ్యక్తిత్వంతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు.
‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయిన నటుల్లో మహేష్ ఒకరు. ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లిపోయిన ఆయనకు ‘రంగస్థలం’ మూవీతో మంచి క్రేజ్ వచ్చింది. ఈ మూవీ పేరే ఆయనకు స్థిరపడిపోయింది. అలాంటి మహేష్ తన పొలిటికల్ కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తెలుగు ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు పవన్ కళ్యాన్. మొదటి నుంచి ప్రజా సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్న పవన్ కళ్యాణ్.. నటన కేవలం ఎంటర్ టైన్ మాత్రమే ఇస్తుంది.. ప్రజా సేవకు అవకాశం ఇవ్వదని భావించి 2014 మార్చి 14 న ‘జనసేన’ పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి ప్రజల కోసం పోరాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఎవరికి వారు ఇప్పటి నుంచే ప్రచారాలు మొదలు పెట్టేశారు. ఇవాళో, రేపో ఎన్నికలు అన్న విధంగా పని చేస్తున్నారు. ఎవరికి వాళ్లు తామే అధికారంలోకి వస్తామంటూ కామెంట్స్ చేస్తున్నారు. అధికార- ప్రతిపక్షాలు విమర్శలు- ప్రతి విమర్శలతో హీట్ ని పెంచేస్తున్నాయి.
ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క స్థానం టీడీపీకి దక్కడంపై జీర్ణించుకోలేని అధికార పార్టీకీ చెందిన వైఎస్సార్సీపీ.. క్రాస్ ఓటింగ్ కారణమని తెలిసి, అందుకు కారకులైన వారిగా భావించి నలుగురి ఎమ్మెల్యేలపై వేటు వేసింది. అయితే వీరిలో ఓ మహిళా ఎమ్మెల్యే కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సస్పెన్షన్ తర్వాత ఆమె టీడీపీలో చేరే అవకాశాలున్నాయని భావించగా.. ఊహించని ట్విస్ట్ నెలకొంది.
రాజోలు ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ తన కన్ను తానే పొడుచుకున్నారా? ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయనపై అనర్హత వేటు తప్పదా?
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు క్షేత్రస్థాయిలో మద్దతు ఉందని.. టైమ్ వచ్చినప్పుడు జనసేన ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమేనని తెలిపారు. వచ్చే ఏపీ ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతామన్న పవన్ కళ్యాణ్.. తనను ఎవరూ డబ్బుతో కొనలేరని అన్నారు.. ఈ క్రమంలో తన రెమ్యూనరేషన్ పై ఓపెన్ కామెంట్స్ చేశారు.
పవన్ కల్యాణ్ సినిమా కేరీర్ లో 27 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. అలాగే రాజకీయంగా జనసేనను స్థాపించి పదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా దిగ్విజయభేరి పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మచిలీపట్నంలో భారీ బహిరంగ సభ కూడా నిర్విహంచేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామం మరోసారి వార్తల్లో నిలిచింది. వారం క్రితం ఇళ్ల తొలగింపునకు నోటీసులు ఇచ్చిన అధికారులు, రెండు ప్రొక్లెయినర్లతో గ్రామానికి చేరుకొని కూల్చివేతలు మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, జనసేన నేతలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.