తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన సరికొత్త రాజకీయ పంథాకు తెరతీస్తున్నాడు. ఎవరు కూడా ఊహించిని రీతిలో పాలన సాగిస్తూ ప్రజల్లో రోజు రోజుకు మరింత ఆధరణను కనబరుస్తున్నాడు. అయితే తాజాగా తమిళనాడులోని ఆరవ తరగతి విద్యార్థి రాసిన లేఖపై స్పందించిన సీఎం ఏకంగా ఫోన్ చేసి మాట్లాడాడు. విషయం ఏంటంటే..?
గతంలో హొసూరులోని టైటాన్ టౌన్షిప్కు చెందిన విద్యార్థిని ప్రజ్ఞా పాఠశాలల పునఃప్రారంభం ఎప్పుడో తెలుసుకోవడానికి ఓ లేఖ రాస్తూ అందులో తన ఫోన్ నెంబర్ రాసి పంపింది. దీంతో ఎప్పుడు బిజీ షెడ్యూల్ లో ఉండే సీఎం ఆ విద్యార్థి లేఖకు రిప్లై ఇవ్వాలనుకున్నాడు. ఇక ఆ లేఖలో ఉన్న విద్యార్థికి ఫోన్ చేసిన సీఎం స్టాలిన్ స్కూల్ ప్రారంభమై పూర్తి విషయాలు తెలిపాడు. ఇక ఏకంగా సీఎం ఫోన్ చేయటంతో విద్యార్థి ప్రజ్ఞా ఆనందంలో మునిగితేలుతోంది. సామాన్య ప్రజలకు మెరుగైన పాలన సాగిస్తున్న స్టాలిన్ పరిపానలపై విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా సీఎం ఆరవ తరగతి విద్యార్థికి ఫోన్ చేయటం విశేషం.