సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ.. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోతో ప్రారంభమైన వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. దీనిపై అటు ప్రభుత్వం, ఇటు సినీ ఇండస్ట్రీ పెద్దలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రెండు ప్రముఖ టీవీ చానెళ్లు నిర్వహించిన ఈ డిబెట్లలో నిర్మాత నట్టి కుమార్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వీడియో ప్రారంభంలో నట్టి కుమార్ మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలుద్దామని గత రెండెళ్ల నుంచి తాను ఎంత చెప్పినా.. మిగతా వారు వినలేదని… పైగా మరో ఏడాదిలో తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని తనను వారించారని ఆరోపించారు. ఇందుకు తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నట్లు తెలిపారు. అంతేకాక గతంలో ఎవరు సీఎంగా వచ్చినా చాంబర్ నుంచి వెళ్లి.. సన్మానించే వాళ్లమని.. కానీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా చాంబర్ నుంచి అలాంటి ప్రయత్నం జరగలేదని నట్టి కుమార్ తెలిపారు. ఈ వ్యాఖ్యలను ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ఖండించారు. ప్రభుత్వం పడిపోవాలని తాము కోరుకోలేదని తెలపారు.
మరో బిట్లో ప్రసన్న కుమార్ మరో ప్రముఖ టీవీ చానెల్ డిబెట్లో మాట్లాడారు. డిసెంబర్ 25, 2021న జరిగిన ఈ డిబెట్ లో ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘గతంలో బ్రిటీష్ అరాచక కాలం ముగిసింది.. ప్రతి దానికి ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది.. లేదంటే దేవుడు పంచభూతాలు, ప్రకృతే రంగంలోకి దిగుతాయి’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మన కులం కానీ వ్యక్తి అధికారంలోకి వస్తే.. అతడు దిగిపోవాలని.. లేదంటే చనిపోవాలని కోరుకుంటున్నారు.. మీలాంటి కుల పిచ్చి ఉన్నవాళ్లను ప్రభుత్వం ఎందుకు ఆదరించాలి.. మీ సంక్షేమం గురించి ఎందుకు పట్టించుకోవాలి.. ప్రోత్సాహాకాలు ఎందుకు ఇవ్వాలి అంటూ వీడియో చూసిన నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.