ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మద్యం ప్రియులకు శుభవార్త చెప్పారు. ఈ ఏడాది మద్యం దుకాణాలను తగ్గించకుండా ఏకంగా ఈ సంవత్సరం అంతా పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక గతంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మెల్ల మెల్లగా మద్యం దుకాణాలను తగ్గిస్తూ మద్యపాన నిషేద రాష్ట్రంగా చేస్తానంటూ హామీలు కురిపించారు.
ఇక ఇదే దిశగా ప్రణాలికలు రూపొందించినా.. హఠాత్తుగా మరో ఏడాది వరకు మద్యం దుకాణాలను పొడిగిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇదే అంశం రాష్ట్ర రాజకీయాల్లో కాస్త చర్చనీయాంశంగా మారింది. ఇక సీఎం జగన్ తీసకున్న నిర్ణయం పట్ల మద్యం ప్రియులకు కాస్త కిక్కిచ్చే అంశంగా చెప్పొచ్చు. ఇక సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.