Viral Video: టిక్టాక్.. రెండు సంవత్సరాల క్రితం వరకు భారత్లో ఇదో సెన్సేషన్. టిక్టాక్ వీడియోల ద్వారా ఎంతో మంది సామాన్యులు సెలెబ్రిటీలు కాగా.. మరెందరో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. నాణానికి రెండువైపులు ఉన్నట్లుగానే టిక్టాక్లోనూ మరో కోణం ఉంది. టిక్టాక్ వీడియోలు చేయాలన్న అత్యుత్సాహంతో చాలా మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. ఎంతోమంది వేరే వాళ్ల ప్రాణాలు తీశారు. ఈ టిక్టాక్ యాప్ చైనా మేడ్ అన్న కారణంతో భారత ప్రభుత్వం 2020 జూన్లో బ్యాన్ చేసింది. తర్వాత టిక్టాక్ అంతరించిపోయింది. అయితే, ఇది కేవలం ఇండియాలో మాత్రమే.. మిగిలిన చాలా దేశాల్లో టిక్టాక్ అందుబాటులో ఉంది. యధావిధిగా జనాలు దాన్ని వాడుతున్నారు. ప్రమాదాలకు గురవుతున్నారు.. గురిచేస్తున్నారు. తాజాగా, ఓ యువతి తన టిక్టాక్ వీడియో కోసం ఏకంగా అడవికే నిప్పుపెట్టింది.
ఈ సంఘటన పాకిస్తాన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్కు చెందిన హుమైరా హస్కర్ అనే యువతి టిక్టాక్లో చాలా ఫేమస్. ఈమెకు టిక్టాక్లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. కొద్దిరోజుల క్రితం హుమైరా అడవిలో ఓ వీడియో షూట్ చేసింది. 15 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో కోసం ఏకంగా అడవినే తగలబెట్టింది. వెనకాల అడవి మంటల్లో తగలబడుతుంటే.. మంట ముందే తెల్లటి దుస్తుల్లో వయ్యారంగా నడుచుకుంటూ ముందుకు వచ్చింది. ఈ వీడియోను తన టిక్టాక్ ఖాతాలో షేర్ చేసింది. ‘‘నేను ఎక్కడుంటే అక్కడ మంటలు పుడతాయి’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లతో పాటు అధికారులు సైతం మండిపడుతున్నారు. మరి, ఈ యువతి వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
This tiktoker from Pakistan has set fire to the forest for 15 sec video.
Government should make sure that culprits are punished and the tiktoker along with the brand should be penalised. #Pakistan #TikTok pic.twitter.com/76ad77ULdJ
— Discover Pakistan 🇵🇰 | پاکستان (@PakistanNature) May 17, 2022
ఇవి కూడా చదవండి : జానపద పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేసిన పెళ్లికూతురు! వీడియో వైరల్