ఈ మధ్యకాలంలో చాలా మంది ఎలక్ట్రానిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాజాగా ఈ-రిక్షా పేలి ఓ యువకుడు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
మారిన టెక్నాలజీ అనుగుణంగా ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ వాడకం ఎక్కువైంది. దీంతో పర్యావరణాన్ని రక్షించడంలో భాగంగా చాలా మంది పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాలకు స్వస్తి పలికి ఎలక్ట్రానిక్ కార్లు, బైక్ లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతా బాగానే ఉన్నా.. కొనుగోలు చేసిన ఆ ఎలక్ట్రానిక్ వాహనాలు అక్కడక్కడ పేలిపోయి మనుషులు చనిపోతున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా చోట్ల చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా ఢిల్లీలో చోటు చేసుకుంది. సోమవారం గ్రేటర్ నోయిడాలోని ఓ ఎలక్ట్రిక్ రిక్షా క్రాకర్ల లోడ్ వేసుకుని వెళ్తుంది. కాగా, అదే రిక్షా ఓ చోట ఆగి ఉండగా.. అందరూ చూస్తుండగా క్షణాల్లో పేలింది. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఓ యువకుడు మరణించినట్లుగా వైద్యులు తెలిపారు.
దీనిపై వెంటనే స్పందించించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అంతా పరిశీలించారు. అయితే ఈ-రిక్షా పేలడానికి అందులో క్రాకర్లు ఉండడమే ప్రధాన కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, ఆ రిక్షా పేలిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. తాజాగా ఎలక్ట్రానిక్ వెహికల్ పేలుడు దాటికి ఓ వ్యక్తి ప్రాణాలు పోయిన ఈ ఘటనపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
UP : नोएडा में जगन्नाथ यात्रा के दौरान पटाखों से भरे रिक्शे में लगी आग, हुआ भीषण हादसा#viral pic.twitter.com/ffWhbjClu0
— जय प्रकाश (@jpjournalist81) February 28, 2023