Viral Video: కొంతమంది ప్రవర్తనను చూస్తే.. ‘వీళ్లకేమైనా పిచ్చా’ అనిపిస్తుంది. ప్రాణం మీదకు వస్తోందని తెలిసినా.. కూల్గా కూర్చుంటారు. అలాంటి వాళ్ల పక్కన ఉంటే మన బుర్ర చెడిపోవటం ఖాయం. అలా పక్కన వారి బుర్ర చెడిగొట్టే ఓ మహిళ గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. రైలు ప్రమాదంలో రైలు ఢీకొట్టి చనిపోవాల్సిన ఆమెను ఓ వ్యక్తి కాపాడాడు. అయితే, ఆమె మళ్లీ చావుకు ఎదురెళ్లింది. రైలు ట్రాకు పక్కనున్న వాటర్ బాటిల్ తీసుకోవటానికి ప్రయత్నించింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లో ఆసల్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తర ప్రదేశ్కు చెందిన ఓ మహిళ కొద్దిరోజుల క్రితం షికోహాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లింది. అక్కడ ప్లాట్ఫామ్లు మారటానికి రైల్వే ట్రాకు మీదకు దిగింది. మెల్లగా నడుచుకుంటూ ఒక ప్లాట్ఫామ్నుంచి మరో ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చింది. అయితే, ఎత్తులో ఉన్న ప్లాట్ఫామ్పైకి చేరలేకపోయింది. ఈ నేపథ్యంలో ఓ వైపు నుంచి రైలు దూసుకు రావటం మొదలైంది. ఆమె ఎంత ప్రయత్నించినా పైకి ఎక్కటం ఆమె వల్ల కాలేదు. కొద్ది సేపటి తర్వాత స్టాఫ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ స్వరూప్ మీనన్ అది గమనించాడు. వెంటనే ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు.
ఆమెకు చెయ్యి ఇచ్చి పైకిలాగాడు. కొన్ని అడుగుల దూరంలోకి రైలు వచ్చింది. అయితే, సదరు మహిళ తన ప్రాణాలు పోలేదని సంతోషించక బాటిల్ కోసం మళ్లీ ట్రాకు దగ్గరకు వచ్చింది. బాటిల్ కోసం కిందకు వంగింది. అదే సమయంలో జుర్ర్ర్ అని రైలు దూసుకెళ్లింది. రెండు అంగులాల దూరం అంతే.. కొంచెం ఉంటే ఆమెను రైలు కొట్టేసేది. ఆమె చేష్టలకు శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే, ఆ మహిళ పట్టించుకోకుండా అక్కడినుంచి వెళ్లిపోయింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Life saved once but risked again for water bottle.Lady was crossing track without using footover bridge & was unable to climb over the platform on the face approaching train in Shikohabad Station.Oir staff Welfare Inspector Sri Ram Swaroop Meena rushed towards her & saved the day pic.twitter.com/WGYsDonHtR
— J.Sanjay Kumar,IRTS (@Sanjay_IRTS) September 9, 2022
ఇవి కూడా చదవండి : Ganesh Immersion: నా గణపతిని తీసుకెళ్ళకండి.. విగ్రహాన్ని పట్టుకుని ఏడ్చేసిన పాప.. వీడియో వైరల్..