అది ముంబై-అహ్మదాబాద్ నేషనల్ హైవే.. రోడ్డుపై భారీగా పడి ఉన్న విదేశీ మద్యం బాటిళ్లు. వీటిని తీసుకునేందుకు జనాలు భారీగా ఎగబడ్డారు. ఒకరిని తోసుకుంటూ మరొకరు మీద మీద పడుతూ చేతికందని బాటిళ్లను సైతం అందుకునేందుకు స్థానిక జనాలతో పాటు వాహనదారులు కూడా ఎగబడ్డారు. ఇదే దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు హైవే మీద విదేశీ మద్యం బాటిళ్లు ఎక్కడివని ఆలోచిస్తున్నారా?
ఇక విషయం ఏంటంటే? వల్సాద్లోని డుంగ్రీ సమీపంలో జాతీయ రహదారిపై డుంగ్రీ వంతెన దిగుతుండగా వేగంగా వెళ్తున్న కారు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు బోల్తా పడటంతో కారు లోపల ఉన్న నాలుగు విదేశీ మద్యం సీసాల కాటన్లు బయటపడ్డాయి. ఇక హైవేపై మద్యం బాటిళ్లు పడి ఉండటాన్ని అటుగా వెళ్తున్న వాహనదారలు, స్థానికులంతా గమనించారు. వెంటనే బహిరంగంగా మద్యం దోచుకున్నారు.
ఇది కూడా చదవండి: Telangana: కృష్ణా నదిలో బయటపడ్డ సీతారామ లక్షణుల విగ్రహాలు! పక్కనే హనుమాన్ విగ్రహం కూడా!
దొరికిందే పండగా అన్నట్లుగా ఒకరిని తోసుకుంటూ మరొకరు మీద మీద పడుతూ చేతికందని బాటిళ్లను అందినకాడికి దోచుకునేందుకు ఎగబడ్డారు. ఇదే దృశ్యాలను అటుగా వెళ్లున్న వాహనదారులు వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో వేగంగా ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి. కాగా ప్రమాదానికి గురైన వ్యక్తులు అక్రమ మద్యంపై పోలీసులు ఎక్కడ ప్రశ్నిస్తారనే భయంతో అదే గాయాలతో అక్కడి నుంచి పరారవ్వడం విశేషం.
ఈ సమాచారం స్థానిక పోలీసులకు తెలియడంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మద్యం బాటిళ్లను దోచుంకుంటున్న వాళ్లను సైతం పట్టుకున్నారు. ఇక గుజరాత్ లో మద్య నిషేధం అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా అక్రమ దందా జోరుగా సాగుతోన్న దరిమిలా ఇది బోల్తా పడిన కారు మద్యం మాఫియాకు చెందిన వ్యక్తులదే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ప్రమాదానికి గురైన కారు నెంబర్ ఆధారంగా ఈ కారు ఎవరిది అనేది తేల్చేందుకు పోలీసులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.