మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇంస్టాగ్రామ్.. తాజాగా యువతరంపై దృష్టిపెడుతూ “టేక్ ఎ బ్రేక్” అనే కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సరికొత్త టూల్ ద్వారా ఫీడ్(స్క్రోలింగ్)లో కాసేపు గడిపిన తర్వాత ఇంస్టాగ్రామ్ లో మరికొంత సమయం గడిపేందుకు అవకాశం కల్పించనుంది. మొదటగా ఈ ఫీచర్ ని యునైటెడ్ స్టేట్స్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో అమలుచేసింది. రాబోయే రోజుల్లో అన్ని దేశాలకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ గురించి ఇంస్టాగ్రామ్ సెప్టెంబర్ లోనే ప్రకటించింది.
కొత్తగా ప్రారంభించిన “టేక్ ఎ బ్రేక్” ఫీచర్ ని యూజర్స్.. సెట్టింగ్స్ లోకి వెళ్లి యాక్టీవ్ చేసుకోవచ్చు. యూజర్స్ ఈ ఫీచర్ తో టైమ్ లిమిట్(10 నిమిషాలు, 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు) ఎంచుకోవచ్చు. అలా టైమ్ సెట్ చేసుకుంటే అప్రమత్తంగా ఉన్నట్లు అర్ధం. టైమ్ ముగిసిన తర్వాత “టేక్ ఏ డీప్ బ్రీత్”, “ఏదైనా వ్రాయండి”, “సెర్చ్ ఆక్టివిటీ” లేదా “లిజెన్ దిస్ సాంగ్” అని ఇంస్టా ఆప్షన్స్ చూపిస్తుంది.
తాజాగా ఇంస్టాగ్రామ్ మరో కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. యూజర్స్ ఎక్కువగా సేమ్ టాపిక్ పోస్ట్లను చూస్తున్నప్పుడు.. వేరే వాటికోసం సెర్చ్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా యూజర్స్ షేర్ చేసుకునే డేటా(కంటెంట్)కి మరింత భద్రత కల్పిస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే యూజర్స్ పాత ఫోటోలను ఒక్కొక్కటిగా కాకుండా ఒకేసారి ఎక్కువ పిక్స్ రిమూవ్ చేసే ఫీచర్ను ఇంస్టా తీసుకొస్తుంది. ఈ ఫీచర్ యూజర్లను ట్యాగ్ చేయకుండా.. ఫాలో చేయని ప్రొఫైల్స్ కనిపించకుండా చేస్తుంది.
ఇంస్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ మోస్సేరి.. ఆన్లైన్లో టీనేజ్ పిల్లలకు రక్షణ కల్పించేందుకు ఈ ఫీచర్ తెస్తున్నట్లు చెప్పారు. అలాగే టీనేజ్ లోపు పిల్లలు ఏమేం.. ఎంతసేపు చూస్తున్నారో.. వారి తల్లిదండ్రులు ట్రాక్ చేయడానికి 2022 మార్చి నుండి కొత్త టూల్స్ ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.