క్షణికావేశంలో కొందరు యువకులు దేనికైన తెగిస్తున్నారు. గోరుతో పోయేదాన్ని చివరికి గొడ్డలిదాక తెచ్చుకుంటున్నారు. ఇక అంతటితో ఆగక రక్తపాతాన్ని సృష్టించడం, లేదంటే శత్రువు ప్రాణం తీయడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు తరుచు జరుగుతూనే ఉన్నాయి. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ యువకుడు ఏకంగా రూ.10 కోసం తుపాకీతో కాల్చాడు. తాజాగా ఝార్ఖండ్ లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఝార్ఖండ్ పలమూ జిల్లాలోని ఓ ప్రాంతంలో ముగ్గురు స్నేహితులు నివాసం ఉంటున్నారు. స్నేహంగా ఉంటూ కలిసి మెలిసి ఉండేవారు. ఇదిలా ఉంటే ఈ ముగ్గురు స్నేహితులు ఇటీవల స్థానికంగా ఉండే ఓ వైన్ షాపుకు మద్యం కొనుగోలు చేసేందుకు వెళ్లారు. వారికి కావాల్సిన మద్యం కొన్నారు. కానీ వారు కొన్న ప్రతీ బాటిల్ కు అదనంగా రూ.10 ఇవ్వాలని వైన్ షాపు యజమాని డిమాండ్ చేశాడు. దీనికి అంగీకరించని ఆ ముగ్గురు స్నేహితులు వైన్ షాపు యజమానితో గొడవకు దిగారు.
దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు స్నేహితులు గొడవ పెద్దది చేశారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ ముగ్గురిలో ఒక యువకుడు తన వద్ద తపాకీతో వైన్ షాపు యజమానిపై ఏడురౌండ్లు కాల్పులు జరిపారు. అయితే ఈ దాడిలో కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడ్డవారిని హుటాహటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.