అడవులు నరకడం వల్లనో.. జనావాసాలు అడవుల్లోకి వెళ్లడమో.. లేదా అడవుల సాంధ్రత తగ్గడమో, కారణం ఏదానా అడవి జంతువులు అరణ్యం వదిలి గ్రామాలు, పట్టణాల్లో సంచరిస్తున్నాయి. ఆహారం కోసమో, దారితప్పిపోవడం వల్లనో అవి అలా వస్తుంటాయి. ఆ క్రమంలో మనుషులు తారసపడితే అవి దాడి చేయొచ్చు. అలా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. క్రూర మృగాలు ఆహారం కోసం గ్రామాల్లో మేకలు, గేదెలు వంటి వాటిపై చేసిన దాడులు ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి. కొన్ని సందర్భాల్లో జరిగిన దాడులు కెమెరా కంటికి చిక్కి తెగ వైరల్ అయ్యాయి.
నాసిక్లోని జున్నెర్ ప్రాంతంలో ఓ వృద్ధుడిపై హైనా చేసిన దాడి ఇలా కెమెరాకు చిక్కి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ వృద్ధిడు చేతిలో బకెట్ పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. అటుగా చెట్ల పొదల్లోంచి ఓ హైనా ఒక్కసారిగా వచ్చి వృద్ధుడి చేయి పట్టుకుంది. అతనిపై దాడి చేయడం ప్రారంభించింది. పక్కనే ఉన్న ఓ యువకుడు వృద్ధుడి చేతిలోని కర్ర తీసుకుని హైనాని కొట్టడం మొదలు పెట్టాడు. మొదట దెబ్బలు తట్టుకున్న హైనా.. చివరకు తోకముడిచి పరారైంది. కానీ, కొంత సమయం తర్వాత ఆ హైనా మరణించింది. అది దాడి చేసిన సమయానికే గాయపడి ఉందని అటవీ అధికారులు తెలిపారు. హైనాకు సింహం ఎముకలైనా పిండి చేయగల శక్తి ఉంటుంది. ఆ వద్ధుడు అదృష్టవంతుడనే చెప్పాలి. ఒళ్లు గగుర్పొడిచే హైనా దాడి దృశ్యాలను మీరూ చూసేయండి.
See this video, how hyena attack on a man walking on road.this is from junner area, nashik. pic.twitter.com/c3CfOUXPdj
— Arun Sahay (@arsh_ved) September 6, 2021