శక్తులు వస్తాయని కోళ్లను, మేకలను బలివ్వడాలు, అమావాస్య రోజు క్షుద్ర పూజలు చేయడం ఇంకా జరుగుతున్నాయి. కొన్ని సార్లు ఇవి పరాకాష్టకు చేరుకుంటున్నాయి. రోగాలు నయం చేస్తాడని దొంగ బాబాల దగ్గరకు వెళ్లి.. గుడ్డిగా చెప్పింది చేస్తున్నారు.
భారత్ శాస్త్ర, సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా.. ఇంకా అనాదిగా కొనసాగుతున్న ఆచారాలను విడిచిపెట్టడం లేదు. శక్తులు వస్తాయని కోళ్లను, మేకలను బలివ్వడాలు, అమావాస్య రోజు క్షుద్ర పూజలు చేయడం ఇంకా జరుగుతున్నాయి. కొన్ని సార్లు ఇవి పరాకాష్టకు చేరుకుంటున్నాయి. రోగాలు నయం చేస్తాడని దొంగ బాబాల దగ్గరకు వెళ్లి.. గుడ్డిగా చెప్పింది చేస్తున్నారు. అర్థ నగ్నంగా, లేదా నగ్నంగా ఇంట్లో పూజలు చేయడం, దేవుడి ప్రసన్నం కోసం మానవ బలులు ఇచ్చే స్థాయికి అనాగరిక చర్య చేరిపోయింది. పట్టణాలతో పోలిస్తే.. గ్రామాల్లో వింత ఆచారాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ఓ వింత ఆచారాన్నే అనుసరిస్తున్నారు జగిత్యాల జిల్లాలోని ఆ గ్రామ వాసులు.
జగిత్యాల జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఓ వింత ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇంతకు ఆ ఆచారం ఏంటంటే.. చీపుర్లతో కొట్టుకుని.. గ్రామ చివరకు వెళ్లి దుస్తులు విప్పేస్తారు. చదవడానికే వింతగా అనిపిస్తున్న ఈ సంప్రదాయపు ఆచారం.. మల్లాపూర్ మండలం పాత దాంరాజు పల్లిలో అమల్లో ఉంది. ఊరికి అరిష్టం పోవాలని, రోగ, చీడలు పోయి ఆరోగ్యంగా ఉండాలని ఇదంతా చేస్తారు. ఏటా ఓ రోజు పురుషులంతా పాత దుస్తులు ధరించి, మొఖాలకు రంగులు పూసుకుని, చీపురు పట్టుకుని, ఒకరినొకరు కొట్టుకుంటారు. ఆ తర్వాత గ్రామ శివార్లలోకి వెళ్లి.. చీపుర్లను అక్కడ వదిలేస్తారు.
తాము వేసుకున్న పాత దుస్తులను అక్కడ చెట్టుకు కట్టి వెను దిరిగి చూడకుండా ఇంటికి చేరుకుంటారు. ఇదో పెద్ద పండుగలా చేస్తారు అక్కడి స్థానికులు. గ్రామంలో ఎలాంటి అరిష్టాలు జరగకూడదని, రోగాల బారిన పడకూడదని కోరుతూ ఏటా ఈ సంప్రదాయాన్ని పాటిస్తామని పాతదాంరాజుపల్లి గ్రామస్థులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మరణాలు తక్కువగా కూడా సంభవిస్తున్నాయట. ఈ వింత ఆచారంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.