వివిధ అవసరాల కోసం ఎక్కువగా ఆర్టీసి బస్సుల్లో ప్రయాణిస్తుంటాము. బస్సు ప్రయాణం సురక్షితం మరియు ప్రేవేట్ ట్రావెల్స్ తో పోల్చుకుంటే తక్కువ ఛార్జీలు ఉండడంతో ప్రయాణికులు ఎక్కువగా ఆర్టీసిని ఆశ్రయిస్తారు. కానీ తాజాగా ఆర్టీసి తీసుకున్న నిర్ణయం ప్రయాణికులను షాక్ కు గురిచేసింది.
ఏ రాష్ట్రంలోనైనా రవాణా వ్యవస్థ చాలా కీలకం. ముఖ్యంగా నగరాల్లో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేయడంలో రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ ముఖ్యపాత్ర వహిస్తుంది. ఆర్టీసి ప్రయాణికుల కోసం వివిధ రకాల ఆఫర్లను ప్రవేశపెట్టి బస్సు ప్రయాణానికే మొగ్గు చూపేలా కృషి చేస్తున్నది. నిత్యం వేల మందిని తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ ప్రజారవాణా వ్యవస్థలో ఆర్టీసి కీలక పాత్ర పోషిస్తున్నది. తాజాగా ఆర్టీసి తీసుకున్న ఓ నిర్ణయం ప్రయాణికులను షాక్ కు గురిచేసింది.
ఉద్యోగస్తులు, వ్యాపారులు, ఇతర వర్గాల వారు నిత్యం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తుంటారు. దీని కోసం ఎక్కువగా ప్రజారవాణా వ్యవస్థ అయినటువంటి ఆర్టీసి బస్సుల ద్వారానే ప్రయాణాలు కొనసాగిస్తారు. అయితే తాజాగా టిఎస్ ఆర్టీసి టికెట్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. పెంచిన టికెట్ ధరలు అన్ని బస్సుల్లో కాకుండా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరిగే సిటీ బస్సుల్లో జారీ చేసే టి -24 టికెట్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కాగా టి-24 టికెట్ ద్వారా సిటీ బస్సుల్లో 24 గంటలు ప్రయాణించడానికి టిఎస్ ఆర్టీసి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రయాణికులకు ప్రస్తుతం రూ. 90 ఉన్న ఈ టికెట్ ధరను రూ. 100కు పెంచారు. సీనియర్ సిటిజన్లకు ఈ టికెట్ ధర ప్రస్తుతం రూ. 80 ఉండగా దాన్ని రూ. 90 కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు జూన్ 16 నుంచి అమల్లో ఉంటాయని టిఎస్ ఆర్టీసి తెలిపింది. కాగా టిఎస్ ఆర్టీసి టి-24 టికెట్ ను ప్రవేశపెట్టినప్పటి నుంచి ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించింది. నిత్యం హైదరాబాద్ పరిధిలో వేలల్లో టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ టికెట్ల ద్వారా సంస్థ మంచి ఆదాయాన్ని సమకూర్చుకుంది.