టీఎస్ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా మార్పులు వస్తున్నాయి. ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా పలు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. టీఎస్ ఆర్టీసీకి మంచి హైప్ ఇస్తున్నారు సజ్జనార్. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. ప్రయాణికుల నుంచి వచ్చే వినతులు, విజ్ఞప్తులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాట పట్టించేందుకు పలు సంస్కరణలను తీసుకొస్తున్నారు. ప్రతి పండుగ సందర్భంగా కొత్తకొత్త డిస్కౌంట్లను ప్రవేశపెడుతున్నారు. తాజాగా ఆయన రంజాన్ పండుగ సందర్భంగా శుభవార్త తెలిపారు.
రంజాన్ పర్వదిన సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త ప్రకటించింది. అయితే ఈ నెల 24 నుంచి మే 3 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వివరించారు. ఈ సదుపాయాన్ని వినియోగించదలచిన వారు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వివరాలకు 040-30102829, 68153333 నెంబర్లను సంప్రదించవొచ్చని ట్విట్ చేశారు. తాజాగా ప్రకటించిన ఈ 25 శాతం డిస్కౌంట్ ఆఫర్కు ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.