జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ని రాజకీయాల మీదే పెట్టారు. ఈ క్రమంలో తన దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. అయితే కేవలం ఏపీ సమస్యల మీద మాత్రమే కాక తెలంగాణలో కూడా తన దృష్టికి వచ్చిన సమస్యలపై స్పందిస్తున్నారు పవన్. ఈ క్రమంలో తాజాగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారంటూ.. వారి సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరారు. ఇంతకు పవన్ ఏ సమస్య మీద ఇలా స్పందించారు అంటే.. రంగారెడ్డి జిల్లాలోని పల్లె చెల్క తండా, సరికొండ గ్రామాల విద్యార్దులు బస్సు సదుపాయం లేక ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తాజాగా స్పందించారు.
బస్సు సౌకర్యం సరిగా లేకపోవడంతో.. ఆ విద్యార్థినిలు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి.. ముఖ్యంగా ఆడబిడ్డలు మేడిపల్లి, మాల్, ఇబ్రహీంపట్నం వెళ్ళి చదువుకొంటున్నారని గుర్తు చేశారు. విద్యా సంస్థలు విడిచిపెట్టాక బస్సులు లేక నడిచి వారంతా నడిచి వెళ్లాల్సి వస్తోంది అన్నారు. అటవీ ప్రాంతం కావడంతో.. సాయంత్రం పూట ఇలా నడిచి వెళ్లాలంటే.. విద్యార్థినిలు భయపడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా ట్విట్టర్ వేదికగా తెలంగాణ మంత్రి కేటీఆర్, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను రిక్వెస్ట్ చేశారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి నుంచి.. కడ్తాల్ మండలం పల్లె చెల్ల తండా, సరికొండ గ్రామాలకు చెందిన సుమారు 70 మంది విద్యార్థులు.. ఇబ్రహీంపట్నం, మాల్, మేడిపల్లిలో చదువుతున్నారు. వీరంతా సాయంత్రం స్కూల్ అయ్యాక.. మేడిపల్లి నుంచి ముద్విన్ వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఇళ్లకు చేరుకుంటారు. అయితే ఆర్టీసీ బస్సు సదుపాయం ఉన్నా.. అప్పుడప్పుడు దాన్ని రద్దు చేయడం.. సక్రమంగా రాకపోవడం.. వల్ల విద్యార్థులంతా 6 కిలోమీటర్ల దూరం నడిచే వెళ్తుంటారు. సాయంత్రం పూట ఇలా అటవీ ప్రాంతంలో ప్రయాణం చేయాలంటే విద్యార్థినిలు భయపడుతున్నారు.
ఈ క్రమంలో విద్యార్థుల సమస్యను కేటీఆర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లాడు పవన్ కళ్యాణ్. ఈ పరిస్థితిని మీడియా కూడా వెలుగులోకి తీసుకువచ్చిందని.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం దీనిపై స్పందించి సమస్యను పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ క్రమంలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సు నడపాలని పవన్ రిక్వెస్ట్ చేశాడు. బస్సు సదుపాయం లేదనో.. అటవీ ప్రాంతంలో నడిచేందుకు భయపడో ఆడబిడ్డలు చదువు మధ్యలో ఆపేసే పరిస్థితి రాకూడదన్నారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఈ సమస్యపై స్పందించి.. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ క్రమంలో పవన్.. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో పాటూ సీఎంవో, కేటీఆర్ ఆఫీస్ను ట్వీట్లో ప్రస్తావించారు. బస్సును ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను రిక్వెస్ట్ చేశారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది.
విద్యార్థుల కోసం బస్సు ఏర్పాటు చేయాలి..
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని పల్లెచెల్క తండా, సరికొండ గ్రామాల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు జనసేన దృష్టికి వచ్చాయి. ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి.. ముఖ్యంగా ఆడబిడ్డలు ..
Sri @SajjanarVC @KTRoffice @TelanganaCMO @tsrtcmdoffice pic.twitter.com/ZRrnXTpLeg— Pawan Kalyan (@PawanKalyan) October 12, 2022
— Pawan Kalyan (@PawanKalyan) October 12, 2022