ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల రోడ్డు ప్రామాదాలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఎక్కడో అక్కడ ఈ ప్రమాదాలు జరగడం.. పదుల సంఖ్యలో ప్రాణాలు కల్పోవడం చూస్తూనే ఉన్నాం. సామాన్యులకే కాదు సెలబ్రెటీలు, రాజకీయ నేతలకు ఈ ప్రమాదాలు తప్పడం లేదు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అతి వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. సెలబ్రెటీలు, రాజకీయ ప్రముఖులకు సైతం ప్రమాదాలు తప్పడం లేదు. సాధారణంగా రాజకీయ నేతలు రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో కాన్వాయ్ లకు ప్రమాదాలు జరగుతున్న విషయం తెలిసిందే. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే..
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల పాదయాత్ర మొదలు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో ఆరు కార్లకు యాక్సిడెంట్ అయ్యింది. అయితే.. బెలూన్లు ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పిందని అంటున్నారు. 20వ రోజు రేవంత్ రెడ్డి పాదయాత్ర సిరిసిల్ల జిల్లాలో జరగనుంది.. 12.30 నిమిషాలకు క్యాంప్ వద్ద పవర్ లూమ్ వర్కర్స్, ఆసాముల సంఘాలతో సమావేశం జరగనుంది. ఈ ప్రమాదం సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బిగ్ బ్రేకింగ్:రేవంత్రెడ్డికి ప్రమాదం! అతివేగంతో ఒకదానికొకటి ఢీకొట్టిన కాన్వాయ్.. ధ్వంసమైన ఆరు కార్లు, రిపోర్టర్లకు స్వల్ప గాయాలు#Revanthreddy #TPCC #accident #SumanTV
— SumanTV (@SumanTvOfficial) March 4, 2023