తెలుగు రాష్ట్రాలలో పరీక్షల కాలం ప్రారంభమైంది. నేటి(మార్చి 15) నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కావున విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యమైనది.. విద్యార్థులు పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని ఇంటర్ బోర్డు అధికారులు చెప్తున్నారు. కాస్త ముందుగానే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకునే ప్రయత్నం చేయండి.
తెలుగు రాష్ట్రాలలో పరీక్షల కాలం ప్రారంభమైంది. కరోనా మొదలైన నాటి నుంచి గతేడాది వరకు ఎప్పుడు ఏ పరీక్ష ఉంటుందో..? ఎప్పుడు రద్దు అవుతుందో..? లేక వాయిదా పడుతుందో..? తెలియని పరిస్థితి ఉండేది. కానీ.. ఈ ఏడాది ఆ పరిస్థితి మారాయి. అనుకున్న సమయానికి విద్యాసంవత్సరాన్ని పూర్తి చేసిన అధికారులు.. పరీక్షలను సైతం షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. నేటి(మార్చి 15) నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానుండగా, రేపటి(మార్చి 16) నుంచి ఇంటర్ రెండో ఏడాది ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు.
ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షా సమయం 180 నిమిషాలు(3 గంటలు). విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం.. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య మాత్రమే పరీకక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అలాగే, ఎగ్జామ్ సెంటర్లలోకి సెల్ ఫోన్లు, డిజిటల్ వాచ్, బ్లూటూత్, ట్యాబ్ లు తదితర డిజిటల్ పరికరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. కావున పరీక్షా కేంద్రాల వద్దకు వీటిని తీసుకెళ్లకపోవడం మంచింది.
తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 03 వరకు, ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 04 వరకు జరగనున్నాయి.
ఏపీలో సైతం తెలంగాణ తరహాలోనే ఇవాళ్టి నుంచే ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 15 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 03న ముగియనుండగా, రెండో ఏడాది పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 04 వరకు జరగనున్నాయి.