గూగుల్ తల్లి కారణంగా ఓ విద్యార్ధి నిండా మోసపోయాడు. గూగుల్ మ్యాప్స్ చూపిన దారి వెంట వెళ్లిన అతడికి వింత అనుభవం ఎదురైంది. ఈ కారణంగా అతడు ఇంటికి వెనుదిరిగాడు. ఆ..? గూగుల్ మ్యాప్స్ మోసం చేయడం ఏంటి అనుకుంటున్నారా..? అయితే, ఈ కథనం చదివేయండి..
తెలుగు రాష్ట్రాలలో పరీక్షల కాలం ప్రారంభమైంది. నేటి(మార్చి 15) నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కావున విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యమైనది.. విద్యార్థులు పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని ఇంటర్ బోర్డు అధికారులు చెప్తున్నారు. కాస్త ముందుగానే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకునే ప్రయత్నం చేయండి.
ఇంటర్, ఎంసెట్ రాసే విద్యార్థులకు శుభవార్త. సబ్జెక్ట్ లో తక్కువ స్కోర్ వచ్చి, ఎంసెట్ లో మంచి ర్యాంకు వచ్చిన విద్యార్ధులకు శాపంగా మారిన వెయిటేజ్ ను ఈ ఏడాది కూడా లెక్కించనున్నట్లు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అయితే మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కరోనా కారణంగా అత్యధికంగా దెబ్బతిన్న రంగాల్లో విద్యా రంగం ఒకటి. వైరస్ కు భయపడి.. చాలా రోజుల పాటు పాఠశాలలను మూసి వేయడమే కాక.. ఆ తర్వాత కూడా ఆన్ లైన్ క్లాసులనే కొనసాగించారు. దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఫలితం గతేడాది ఇంటర్ రిజల్ట్స్ లో స్పష్టంగా కనిపించింది. చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీనిపై నిరసనలు వెల్లు వెత్తడంతో ప్రభుత్వం అందరిని పాస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరుసటి ఏడాది పరీక్షలకు […]
కాలేజీలో కరెంటు లేక విద్యార్థులు కార్ల వెలుతురులో పరీక్ష రాసిన సంఘటన బిహార్లో జరిగింది. సిబ్బంది వైఫల్యం కారణంగా దాదాపు 400 మంది 12వ తరగతి(ఇంటర్మీడియట్) విద్యార్థులు కార్ల హెడ్ లైట్ల వెలుతురులో పరీక్ష రాశారు. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోతిహరి పరిధిలో గల మహారాజా హరేంద్ర కిశోర్ సింగ్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి పరీక్ష హిందీని రెండు భాగాలుగా నిర్వహించారు. ఫస్ట్ పేపర్ పరీక్ష […]