నేటి సమాజంలో చాలా మంది మనుషులు.. అన్ని సంక్రమంగా ఉన్నా సంతోషంగా ఉండటం లేదు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొలేక భయపడి పోతుంటారు. మరికొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. అయితే కొందరు విభిన్న ప్రతిభావంతులు.. తమకు ఉన్న లోపానికి బాధపడక.. ఎంతో ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. సమాజంలో ఎదురవుతున్న అనేక సమస్యలకు ఎదురొడ్డి నిల్చున్ని జీవిస్తున్నారు. ఆ కోవకు చెందిన వ్యక్తే 65 ఏళ్ల చింతం రాజయ్య. ఆయన కంటిచూపు లేకపోయిన ఏ సహాయం లేకుండా ఊరంతా తిరగడం, నీటిలోని మోటార్లను బయటకు తీయడం, వాటిని మరమ్మతులు చేయటం చేస్తున్నారు. నా అనుకున్న వాళ్లంత దూరమైపోయారు. అయిన కుంగిపోయకుండా ఒకరి పై ఆధారపడకుండా జీవనం సాగిస్తున్నాడు. విన్నడానికి ఆశ్చర్యంగా ఉన్న రాజయ్య జీవితం ఎందరికో ఆదర్శం. అయితే ఈయన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలంగాణ రాష్ట్రం హనుమ కొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపురం గ్రామానికి చెందిన చింతం రాజయ్యాకు .. తన ఆరేళ్ల వయసులోనే కంటి చూపు కోల్పోయారు. అయినా వాళ్ల నాన్న ఈ త నేర్పిచండంతో అందులో ప్రావీణ్యం సంపాదించారు. అలా పెరిగి పెద్దయ్యాడు రాజయ్య. ఈ క్రమంలోనే కనపడకున్న వ్యవసాయ మోటార్ల మరమ్మతులు చేయడం నేర్చుకుని..వాటిపై పట్టు సాధించారు. అంతే కాక బావుల్లోకి దిగి మరి పాడైన మోటర్లను బయటకి తీయడం.. వాటిని రిపైర్లు చేయడం నేర్చుకున్నాడు.
అలా మోటారు పనులు ద్వారా వచ్చే డబ్బుతో ఎవరిపైన ఆధారపడకుండా జీవిస్తున్నారు. పొలాల్లోని బావుల దగ్గరకు ఎవరి సాయం లేకుండానే వెళ్లి వస్తారు. తల్లిదండ్రులు చనిపోయాక రాజయ్యను.. ఆయన పెద్ద అన్న చేరదీసి అన్నం పెట్టేవాడు. కొంతకాలానికి ఆయన కూడా చనిపోవడంతో రాజయ్య ఒంటరి వారయ్యారు. దీంతో ఎవరిపై ఆధారపడొద్దని నిర్ణయించుని గ్యాస్ పోయ్యి మీద వంట చేయడం నేర్చుకున్నాడు.
వారసత్వంగా వచ్చిన పెంకుటింట్లో రాజయ్య ఉంటున్నారు. చూపులేకున్న వినోదం కోసం ఓ టీవీ పెట్టుకున్నారు. బొమ్మ కనిపించకున్న ఆడియో వింటూ కాలక్షేపం చేసేవారు. కాళ్లకు చెప్పులు లేకపోతేనే ఊరిలో దారుల్ని ఈజీగా గుర్తించగలనని రాజయ్య తెలిపారు. మరి.. మనోనేత్రంతో ప్రపంచాన్ని చూస్తున్న చింతం రాజయ్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.