దేశంలో ఏదైనా కష్టపడి సంపాదిస్తే ఖర్చు చేయడానికి అన్ని విధాలుగా ఆలోచిస్తాం.. అదే ఫ్రీగా దొరుకుతుందని తెలిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడికి వెళ్లి అందినంత చే జిక్కించుకుంటాం. ఇటీవల రోడ్డుపై ప్రమాదలకు గురై ఏదైనా వాహనాలు పడిపోతే అందులో ఉన్న వస్తువులు క్షణాల్లో మాయం చేస్తున్నారు జనాలు. తాజాగా నగరంలోని ఔటర్ రింగ్ పై లారీ బోల్తా పడింది. ఇందులో వందల సంఖ్యల్లో థమ్స్అప్ బాటిల్స్ నేలపై పడ్డాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్పంగా గాయపడ్డారు. అటుగా వస్తున్న జనాలు బాటిల్స్ ఎత్తుకేళ్ల పనిలో డ్రైవర్, క్లీనర్ పరిస్థితి ఏంటని పట్టించుకోకుండా క్షణాల్లో లూటీ చేశారు.
జనాల నిర్వాకం చూసి అందులో ఓ వ్యక్తి థమ్స్అప్ బాటిల్స్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడిన విషయం పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. వాహనం అబ్దుల్లాపూర్మెట్ వైపు వెళుతుండగా చాలా వేగంగా డ్రైవింగ్ చేయడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని దాంతో లారీ బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.