రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆవిడ తల్లి గుగులోతు దస్మా(86) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. పది రోజుల క్రితం అనారోగ్యంతో యశోధ ఆస్పత్రిలో చేరిన దస్మా శుక్రవారం కన్నుమూశారు. గత ఫిబ్రవరి నెలలో సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యానాయక్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.
ఆ విషాదం నుంచి కోలుకునేలోపే తల్లి దస్మా కాలం చేశారు. సత్యవతి రాథోడ్ మాతృమూర్తి మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. మంత్రి కుటుంబానికి సీఎం ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆవిడ అంత్యక్రియలు మహబూబాద్ జిల్లా కురవి మండలం పెద్ద తండాలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి దస్మా మరణం పట్ల మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి శ్రీమతి గుగులోత్ దస్మా మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబానికి సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) July 29, 2022