తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ అస్వస్థతకు గురి కావడంతో ఆమెను వెంటనే కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని.. ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెను చూసేందుకు సోమాజిగూడ యశోద హాస్పిటల్కు బయలుదేరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరడంతో యశోద హాస్పిటల్ వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. అయితే మార్చి ఆరంభంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అస్వస్థతకి గురి కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. నీరసంగా ఉండడం, ఎడమ చేయి లాగుతోందని సీఎం చెప్పడంతో ఆయన కుటుంబ సభ్యులు యశోద హాస్పిటల్లో చేర్పించారు. సీఎం కేసీఆర్ కి డాక్టర్లు యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించారు. ఒక్క రోజు అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.