తెలుగు దేశం లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. తెలంగాణ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే..
టీడీపీలో విషాదం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతు మంగళవారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దయాకర్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు నివాళులర్పించడమే కాదు.. పాడె కూడా మోశారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ సీనియర్ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మంగళవారం పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. దయాకర్ రెడ్డి స్వస్థలంలో మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం పర్కాపురం గ్రామం. కొత్తకోట దయాకర్రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. అమరచింత నుంచి రెండుసార్లు.. మక్తల్ నుంచి ఒకసారి పోటీ చేసి విజయం సాధించారు. దయాకర్ రెడ్డి మరణ వార్త విన్న వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించడానికి వచ్చారు.
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. చింతకుంట మండలంలోని పర్కాపురంలో దయాకర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రలో పాల్గొనేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పలువురు రాజకీయ నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పర్కాపురం గ్రామం ఒక్కసారిగా జనసంద్రంగా మారింది. ఇక అంతిమ యాత్రంలో చంద్రబాబు నాయుడు కూడా పాల్గొని.. దయాకర్ పాడెను మోశారు. శోక సంద్రంలో మునిగిపోయిన దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.