మొన్నటి వరకు ధర. 220 నుంచి 240 ఉన్న ఉన్న కిలో చికెన్ ధర ఇప్పుడు అమాంతం పెరిగింది. దీంతో మాంసం ప్రియులు షాక్ గురవుతున్నారు.
ఈ రోజుల్లో చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగని పరిస్థితి. వారంలో కనీసం మూడు రోజులైన ఇంట్లో నాన్ వేజ్ ఉండి తీరాల్సిందే. అలాంటి వారికి ఇప్పుడు ఇది షాకింగ్ వార్త అనే చెప్పాలి. అవును.. మీరు విన్నది నిజమే. మొన్నటి వరకు 240 పలికిన చికెన్ ధర.. ఇప్పుడు ఉన్నట్టుండి అమాంతంగా పెరిగింది. దీంతో మాంసం ప్రియులు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. ఇంతకి చికెన్ ధర ఎంత పెరిగిందంటే?
ఎండకాలం మొదలైనప్పటి నుంచి చికెన్ ధరలు మాములుగానే ఉన్నాయి. మొన్నటి వరకు హైదరాబాద్ లో కిలో చికెన్ ధర రూ. 220 నుంచి రూ. 240 వరకు పలికింది. కానీ, ఇప్పుడు అదే చికెన్ ధర ఏకంగా కొండెక్కి కూర్చుంది. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాద్ లో స్కిన్ లెస్ కిలో చికెన్ ధర రూ. 300, విత్ స్కిన్ రూ.280కు చేరింది. అమాంతంగా కిలో చికెన్ రూ.300కి చేరడంతో మాంసం ప్రియులు షాక్ గురవుతున్నారు. ఇక లైవ్ బర్డ్ విషయానికొస్తే కిలో చికెన్ ధర గతంలో 120 ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.180కి ఏగబాకింది. ముక్కలేనిదే ముక్కదిగని కొందరు మాంసం ప్రియులు ఇప్పుడు పెరిగిన ధరల నేపథ్యంలో కొనాలంటేనే భయపడిపోతున్నారు.