దొంగబాబాల గురించి ఎన్ని కథనాలు వచ్చిన.. ఎంత అవగాహన కల్పించినా ప్రజల్లో చైతన్యం రావడంలేదు. ఈజీగా డబ్బులు పొందాలనే ఓ దురాశతో ఈ దొంగబాబాల మాయలో కొందరు పడుతున్నారు. డబ్బుపై ఉన్న అత్యాశేనే దొంగబాబాలకు ఆయుధంగా మారుతోంది. ఇటీవల ఓ వ్యక్తి ఇంట్లోని పూజగదిలో కోట్ల విలువ చేసే బంగారం ఉందని దొంగబాబాలు నమ్మించారు. దానిని వెలికి తీస్తామంటూ ఆయన నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుని ఉడాయించారు. ఆదివారం ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో చోటుచేసుుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కరీనంగర్ జిల్లా గన్నేరువనం గ్రామానికి చెందిన మతం చందు, రాజన్న సిరిసిల్ల జిల్లా తుంగలపల్లికి చెందిన ఎర్నాళ్ల సంజీవ్ లు నకిలీ బాబాలుగా అవతారం ఎత్తారు. ఏప్రిల్ 11న హైదరాబాద్ లోని ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ కు చెందిన మాచర్ల రాజు వద్దకు వచ్చి.. బాబాలుగా పరిచయం చేసుకున్నారు. ఇంటికి తీసుకెళ్లి తమకు అన్నం పెడితే మంచి జరుగుతుందని మాయమాటలు చెప్పారు. ఆ దొంగబాబాల మాటలు నమ్మిన రాజు..వారిని ఇంటికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో రాజు ఇంట్లోని పూజ గదికి తాళం వేసి ఉండటం ఈ బాబాలు గమనించారు. ఎందుకు మూసి ఉంచారు? అని రాజుని అడిగారు. తమ సోదరుడి కుమారుడు మరణించాడు అందుకే తాళం వేశామని రాజు తెలిపాడు.
ఇదీ చదవండి: కర్నూలులోని ఆ ప్రాంతంలో వజ్రాల పంటే! ఎందుకంటే..
అలా ముూసి ఉంచితే అరిష్టమని మాయమాటలు చెప్పి రూ.35 వేలు వసూలు చేశారు. పథకంలో భాగంగా కొన్ని రోజులు విరామం ఇచ్చి రాజు ఇంటికి మరోసారి వెళ్లారు. పూజ గదిలో రూ.4 కోట్ల విలువైన బంగారం ఉందని.. పూజలు చేసి తీసుకోవచ్చని రాజుకు తెలిపారు. అందుకు సిద్ధిపేటలో రూ.1.80 లక్షల విలువ చేసే పూజా సామగ్రి కొనుగోలు చేయాలని చెప్పి కమీషన్ గా దుకాణదారుడు బాబాలకు రూ.1.50 లక్షలు చెల్లించాడు. అనంతరం వివిధ పూజల పేరిట రూ.7.50 లక్షలను దొంగబాబాలు వసూలు చేశారు.
పూజలు చేశామని కొన్ని రోజుల తర్వాత పూజ గది తెరవాలని చెప్పి.. అక్కడి నుంచి వెళ్లి పోయారు. రోజులు గడిచిన..బంగారం కనిపించక పోవడంతో మోసపోయానని రాజు గ్రహించాడు. ఈనెల 20న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా ఎస్ వోటీ బృందం త సాయంతో నకిలీ బాబాల ఇద్దిరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.15 వేల నగదు, పూజా సమాగ్రి స్వాధీనం చేసుకున్నారు.మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.