గంజాయి స్మగ్లింగ్ కేసులో హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అక్రమంగా గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడిన ఓ వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించింది. రెండేళ్ల క్రితం 1,427 కిలోల గంజాయి సరఫరా చేస్తూ పంతంగి టోల్ ప్లాజా వద్ద నదీమ్(25) అనే వ్యక్తి డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ(DRI) అధికారులకు పట్టుబడ్డాడు. ఆ పట్టుబడిన గంజాయి విలువ రూ.3.56 కోట్ల పైనే ఉంటుంది.
కొద్ది రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లా నుంచి యూపీకి ఓ ట్రక్కులో నదీమ్.. గంజాయిని తరలిస్తుండగా డీఆర్ఐ అధికారులు సమాచారం అందింది. దీంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద మాటు వేసిన అధికారులు.. నదీమ్ ను పట్టుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై గత కొంతకాలంగా విచారణ జరుపుతన్న నాంపల్లి కోర్టు.. మంగళవారం తుది తీర్పు వెలువరించింది. అతడిని దోషిగా తేల్చింది. దోషి కి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పించారు.లక్షరూపాయలు జరిమాన కట్టకుంటే మరో మూడేళ్ల అదనంగా జైలు శిక్ష అనుభవించాలని తెలిపింది. గంజాయి కేసులు నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. గంజాయి సరఫరా చేసే వారికి కోర్టు అదిరిపోయే శిక్ష వేసిందని పలువు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియలజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.