గతేడాది అక్టోబర్ లో బంజారాహిల్స్ లోని డీఏవీ స్కూల్లో చిన్నారిపై జరిగిన అత్యాచారం ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగిన విషయం తెలిసింది. తాజాగా ఈ ఘటనలో నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
గతేడాది అక్టోబర్ లో బంజారాహిల్స్ లోని డీఏవీ స్కూల్లో చిన్నారిపై జరిగిన అత్యాచారం ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగిన విషయం తెలిసింది. అలానే చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు రజనీకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. తాజాగా డీఏవీ స్కూల్ ఘటనలో దోషికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. దోషికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు ఇచ్చింది.
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే సంఘటన ఒకటి గతేడాది హైదరాబాద్ నగరంలోని డీఏవీ స్కూల్ చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై అదే స్కూల్ ప్రిన్సిపల్ కారుకు డ్రైవర్ గా పని చేస్తున్న రజనీ కుమార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. నాలుగేళ్ల పాప అని చూడకుండా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రెండు నెలలుగా పాపతో తన కామవాంఛ తీర్చుకుంటున్నాడు. పాప అస్వస్థతకు గురవ్వటంతో తల్లిదండ్రులు ఏమైందని అడిగారు. దీంతో అసలు విషయం బయటపడింది.
చిన్నారి తల్లిదండ్రులు నిందితుడిపై ఆగ్రహంతో ఊగిపోయారు. పాఠశాల దగ్గరకు వెళ్లి రజనీ కుమార్ను నిలదీశారు. అతడు పొంతనలేని సమాధానాలు చెప్పటంతో వారికి కోపం కట్టలు తెచ్చుకుంది. పాప తల్లిదండ్రులతో పాటు మరికొంతమంది అతడిపై దాడికి దిగారు. కట్టలు తెంచుకున్న కోపంతో అతడ్ని చితకబాదారు. అనంతరం నిందితుడ్ని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఆరునెలల దర్యాప్తు తరువాత దోషికి శిక్ష కూడా ఖరారు చేసింది. దోషి రజనీ కుమార్ కు 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు ఇచ్చింది.