ప్రేమ అనేది ఓ తియ్యటి భావం. చూపు చూపు కలిసి, మాటలను ముత్యాలుగా చేసుకుని కబుర్లలో మునిగితేలుంటారు ప్రేమికులు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక, లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు సెల్ ఫోన్లలో ముచ్చట్లు పెట్టుకుంటారు.
ప్రేమ అనేది ఓ తియ్యటి భావం. చూపు చూపు కలిసి, మాటలను ముత్యాలుగా చేసుకుని కబుర్లలో మునిగితేలుంటారు ప్రేమికులు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేక, లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు సెల్ ఫోన్లలో ముచ్చట్లు పెట్టుకుంటారు. ప్రేమ మైకంలో రెక్కలు విప్పిన పక్షుల్లా విహరిస్తుంటారు. అయితే ఇద్దరి మధ్య గొడవలు లేనంత వరకు ఓకే కానీ, ఇక చిచ్చు మొదలైందా చిన్న చిన్న విషయాల దగ్గరే మనస్పర్థలు ఏర్పడతాయి. ఒకరిని ఒకరు నిందించుకుంటూ బ్రేకప్ చెప్పేసుకుంటారు. వీరి ప్రేమ పెళ్లికి వరకు వెళ్లడం కష్టమే అవుతుంది. ఆ సమయంలో ఆ బాధను భరించలేక బలవంతంగా ప్రాణాలు తీసుకున్నవాళ్లు, ప్రాణాలు తీసిన ఘటనలు చూశాం.
ప్రియుడితో గొడవ యువతి మనస్సును గాయపరిచింది. బ్రేకప్ చెప్పిన ప్రియుడు దూషించడంతో మనస్థాపానికి గురైన యువతి ఇంటి నుండి వెళ్లిపోయిన ఘటన తెలంగాణలోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుతారిగూడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ, సుతారిగూడకు చెందిన వరగంటి శైలజ(25), స్థానికంగా ఉంటోన్న దినకర్ అనే యువకుడు ప్రేమించుకుంటున్నారు. గత రెండేళ్లుగా వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుండగా.. ఇటీవల ఓ విషయంపై గొడవ జరిగి మాట్లాడుకోవడం మానేశారు. అమ్మాయి మాట్లాడకపోవడంతో జీర్ణించుకోలేకపోయిన దినకర్.. మద్యం సేవించి శైలజ ఇంటి వెళ్లి ఆమెను దూషించాడు.
అతడు గొడవ పడుతున్న సమయంలో చుట్టు ప్రక్కల వారు చూడటం శైలజకు అవమానంగా అనిపించింది. దీంతో మానసికంగా కుంగిపోయింది. మరుసటి రోజు ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయింది. అయితే కుమార్తె కనిపించకపోయే సరికి కంగారు పడ్డ కుటుంబ సభ్యులు వెతకడం మొదలు పెట్టారు. టివీ దగ్గర వారికి ఓ లేఖ కనిపించింది. అందులో ‘అమ్మా.. అందరి ముందు నా పరువు పోయింది. ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాను. నాకోసం వెతకొద్దు..’ అని రాసింది. ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అని వస్తుండగా.. కంగారు పడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. యువతిని పట్టుకునే పనిలో ఉన్నారు.