తాళం వేసిన ఇళ్లే అతడి టార్గెట్. అతడు ఒక్కసారి టార్గెట్ చేశాడంటే ఆ ఇళ్లు ఖాళీనే. ఇలా నిత్యం దొంగతనాలకు పాల్పడుతూ.. పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతుండే వాడు. ఏడాది కాదు రెండేళ్లు కాదు.. ఏకంగా 16 ఏళ్లుగా దొరక్కుండా పోలీసులకు చుక్కలు చూపించాడు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, గోవా రాష్ట్రాల్లోనూ చోరీలకు పాల్పడుతున్న ఈ కేటుగాడిని ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేటుగాడిని పట్టుకునేందుకు పోలీసులు 70 వేలకు పైగా ఫోన్ నంబర్స్ ను శోధించారు.
16 ఏళ్లుగా చిక్కకుండా పోలీసులకు చుక్కలు చూపించాడు మోస్ట్ వాంటెడ్ దొంగ రాసికుల్ ఖాన్.5 రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తూ.. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. తాళం ఉన్న ఇళ్లను రెక్కీ చేసి బంగారం, నగదు చోరీ చేసేవాడు. ఇలా దొంగతనాలు చేస్తూ 2006 నుండి పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అలా తప్పిచుకుని తిరుగుతూనే.. రాచకొండ పరిధిలో 17 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు.
తెలంగాణతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లోనూ చోరీలకు పాల్పడుతున్న వీడిపై వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. పలు కేసుల్లో ఇప్పటివరకు మూడున్నర కిలోల బంగారం చోరీ చేశాడు. ఈ కేటుగాడిని పట్టుకునే క్రమంలో 70వేల ఫోన్ నంబర్స్ సెర్చ్ చేశారు పోలీసులు. అతడి నుంచి 52 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అడవుల్లో ఉండి వీరప్పన్ పోలీసులకు చుక్కలు చూపిస్తే.. జనవాసాల్లో ఉండి వీడు 16 ఏళ్లుగా పోలీసులకు చుక్కలు చూపించాడు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.