ఇటీవల ఎమ్మెల్యే కోమటిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మునుగోడులో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి క్యాంపు కార్యాలయం నుండి ఉప్పల్ వరకు పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి తీన్మార్ స్టెప్పులతో కార్యకర్తల్లో జోష్ నింపారు.
మునుగోడులో టీఆర్ఎస్ ప్రజాదీవెన సభకు సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో భారీ ఏర్పాట్లు పూర్తిచేశారు. నేడు టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి క్యాంపు కార్యాలయం నుండి ఉప్పల్ వరకు పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ తీశారు.
ఈ సందర్భంగా తెలంగాణ పాటలు పెట్టడంతో మంత్రి మల్లారెడ్డి పాటలకు తగ్గట్టు తీన్మార్ స్టెప్పులేసి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. తర్వాత కాన్వాయ్లో కూడా కాసేపు స్టెప్పులు వేశారు. తర్వాత మునుగోడు పర్యటనకు బయల్దేరారు. మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని సభలోనే సీఎం ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.