గత కొన్ని రోజుల వరుస గుండెపోటు మరణాలు ప్రజలను భయందోళలనకు గురి చేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అందరూ హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. తాజాగా ఓ వివాహిత గుండెపోటుతో మరణించింది.
ఈ మధ్య చాలా మంది గుండెపోటుతో చనిపోతున్నారు. చిన్న, పెద్ద.. ఆడ, మగ వయస్సుతో భేదం లేకుండా అందరూ గుండెపోటుకు బలవుతున్నారు. ఫిట్ నెస్ కోసం అనేక విధాల జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోంది. మనం తినే ఆహారపు అలవాట్లు కూడా దీనికి కారణం కావచ్చు అని నిపుణులు చెబుతున్నారు. జనాలు పౌష్టికాహారం తీసుకోవడం మానేసి రెడీమేడ్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. తద్వారా లేని పోని రోగాల బారిన పడడమే కాకుండా గుండెపోటుకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో ఈ మరణాలు కూడా ఎక్కువయ్యాయి. ఇకపోతే తాజాగా ఓ మహిళ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మహబూబాబాదు జిల్లా నెల్లికుదురు మండలం చిన్నముప్పారం గ్రామానికి కదిర రాకేష్-సృజన దంపతులు గత కొంత కాలంగా జపాన్ లో ఉద్యోగ రిత్యా స్థిరపడ్డారు. వీరికి 5 ఏళ్ల కూతురు కూడా ఉంది. అయితే కొన్ని నెలలుగా సృజన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స కోసం ఇటీవల జపాన్ నుంచి వరంగల్ వచ్చారు. ఇకపోతే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోహిణి.. మంగళవారం ఉన్నట్టుండి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. ఆ మహిళ హార్ట్ ఎటాక్ తో మరణించడంతో మృతురాలి భర్త, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. వరుస గుండెపోటు మరణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.