గత రెండేళ్లుగా కరోనా కష్టాలతో పేద ప్రజలు అతలాకుతలం అయ్యారు. చిరు ఉద్యోగులు, వ్యాపారాలు చేసేవారు.. వాహనాలు నడిపి జీవించేవారు ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రక రకాల చట్టాలను తీసుకు వస్తూ తమపై లేని పోని భారం మోపుతున్నారని ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల ను నిలుపుదోపిడీ చేస్తోందని డ్రైవర్స్ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే 24 గంటల పాటు ఆటోలు, క్యాబ్లు, లారీల సేవలు నిలిపివేస్తున్నట్లు డ్రైవర్స్ జేఏసీ ప్రకటించారు. 2019 అమలు చేస్తూ జరిమానాల పేరుతో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల పై ఎక్కడ లేని భారం మోపుతున్నారని.. ఇటీవల కరోనా నేపథ్యంలో తాము ఎన్నో కష్టాలు పడ్డామని.. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని.. గత కొంత కాలంగా గిరాకీలు కూడా పెద్దగా ఉండటం లేదని.. ఇలాంటి సమయంలో ఫిట్నెస్ లేట్ ఫీజు పేరుతో వాహనదారులపై రోజుకు రూ. 50 వసూలు చేయడం ఎంతవరకున్యాయం అని లారీ డ్రైవర్స్ యూనియన్ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే వెహికల్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, ఈఎంఐలు భరించలేనంతగా పెరిగిపోయాయి.. వాటికి తోడు పెట్రోల్, డీజిల్, గ్యాస్ పెరిగాయి. ఈ సమయంలో నూతన మోటర్ వాహనాల చట్టం తీసుకు వచ్చి మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే చర్యను వ్యతిరేకిస్తూ.. గురువారం ట్రాన్స్పోర్టు భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ధర్నాలో ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఆర్ఎస్కేవీ, ఐఎఫ్టీయూ, ఐఎన్టీయూసీలతో పాటు అన్ని లారీ, క్యాబ్, ఆటో యూనియన్లు పాల్గొంటాయని తెలిపారు.