వారు నిత్యం కూలీ చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఏదో అవసరాల కోసం బ్యాంకు ఖాత తీసుకున్నారు. రోజూ వారీ సంపాదన తప్ప పెద్ద మొత్తంలో డబ్బును ఎప్పుడు వాళ్లు చూడలేదు. అలాంటి వారికి అనుకోకుండా అదృష్టం వరించింది. వారి బ్యాంకు ఖాతాల్లో కోట్ల రూపాయాలు జమ అయ్యాయి. దీంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఇంక ఆలస్యం చేయకుండా అవి మనకు ప్రభుత్వం వేసి ఉండోచ్చని భావించి ఖర్చు పెట్టారు. చివరకు బ్యాంకు అధికారుల వచ్చి అసలు విషయం చెప్పడంతో షాక్ అయ్యారు. ఈ ఘటన అదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీల బ్యాంకు ఖాతాల్లో ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా వారి అకౌంట్లో రూ.60 కోట్ల జమ అయ్యాయి. ఒక్కసారిగా కోట్ల రూపాయల అకౌంట్లో జమకావడంతో గిరిజన బిడ్డలు అవాక్కయ్యారు. అకౌంట్లో ఒక్కసారిగా భారీ మొత్తంలో నగదు పడటంతో అవసరాల మేరకు డబ్బును ఉపయోగించుకున్నారు. అయితే ఇటీవల బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేయడంతో షాక్ కు గురయ్యారు. ఇందంతా ఆదిలాబాద్ లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జరిగింది. సాంకేతిక సమస్య వల్ల అలా తప్పు జరిగిందని అధికారులు గుర్తించారు. డబ్బు తిరిగి చెల్లించాల్సిందిగా గిరిజనులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆదివాసీలు అందరూ జిల్లా కేంద్రలోని ఆ గ్రామీణ బ్యాంకును ముట్టడించారు. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.