హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు.. అంటేనే.. ఇంటి దగ్గర సరైన పరిస్థితులు లేవని.. చదువకునేందుకు వీలుగా లేదని అర్థం. అందుకే బిడ్డలకు దూరంగా ఉండాల్సి వస్తుందని తెలిసినా.. చాలా మంది తల్లిదండ్రులు.. పిల్లల భవిష్యత్తు కోసం హాస్టల్లో వేస్తుంటారు. మరి కొందరు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక.. ప్రభుత్వ హాస్టల్లో ఉంచి పిల్లలను చదివిస్తుంటారు. పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఇంతలా ఆలోచిస్తుంటే.. మరి బాగా చదువుకోవాల్సిన పిల్లలు ఏం చేస్తున్నారు.. చదువు సంగతి పక్కన పెట్టి.. చెడు అలవాట్లను అలవర్చుకుంటున్నారు. తాజాగా కొన్ని రోజుల క్రితం మంచిర్యాల బీసీ బాలుర వసతి గృహంలో కొందరు విద్యార్థులు హాస్టల్లోకి బీర్లు తెచ్చకుని తాగిన సంఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కోవకు చెందని సంఘటన మరొకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థుల బీర్ పార్టీ.. వాట్సాప్ గ్రూపుల్లో ఫోటోలు వైరల్!
నిర్మల్ జిల్లా ముదోల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో హుక్కా కలకలం రేపింది. రాత్రి వేళ హాస్టల్ ప్రాంగణంలో హుక్కా తాగుతూ పట్టుబడ్డారు ముగ్గురు విద్యార్థులు. ఇది కాస్త వివాదాస్పదం కావడంతో.. విషయం కాస్త పోలీసు స్టేషన్కి చేరింది. దాంతో అధికారులు.. విద్యార్థుల తల్లిదండ్రులను పిలిచి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతేకాక హాస్టల్లో హుక్కా పరికరం స్వాధీనం చేసుకున్నారు. చదువుకోమని హాస్టల్లో ఉంచితే.. ఇలాంటి చెడు అలవాట్లు నేర్చుకుంటున్నారా అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Vishwak Sen: కష్టాల్లో హీరో విశ్వక్ సేన్! HRC లో ఫిర్యాదు!