తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు రావు ఫార్ములా వన్ రేస్ వద్ద సందడి చేశారు. తన మిత్రులతో కలిసి శనివారం రేసు జరుగుతున్న చోటుకు వెళ్లాడు. ఎంతో ఆసక్తిగా ఫార్ములా వన్ రేస్ను చూశాడు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. షార్ములా వన్ రేసు చూడటానికి వెళ్లిన హిమాన్షు అక్కడ బేల్పురి తిన్నాడు. అది కూడా రోడ్డు పక్క చిన్న బుట్ట వ్యాపారి దగ్గర. తన మిత్రులతో కలిసి హిమాన్షు బుట్ట వ్యాపారి దగ్గరకు వెళ్లాడు. తనకు బేల్పురి కావాలని అడిగాడు.
తనతో పాటు తన మిత్రులకు కూడా బేల్పురి కొనిచ్చాడు. ఇందుకు గానూ కొంత డబ్బును చిరు వ్యాపారికి ఇచ్చాడు. ఆ తర్వాత వ్యాపారం ఎలా జరుగుతుందో వ్యాపారిని అడిగి తెలుసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడినుంచి రేస్ జరుగుతున్న దగ్గరకు ప్రయాణం అయ్యాడు. ఈ నేపథ్యంలో జనం పెద్ద సంఖ్యలో ఆయన్ని చుట్టు ముట్టారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. హిమాన్షు ఏమాత్రం ఇబ్బంది పడకుండా వారితో ఒపిగ్గా సెల్ఫీలు దిగాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, అధిక బరువు కారణంగా హిమాన్షు రావు గతంలో ట్రోలింగ్స్ గురైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ట్రోలర్స్కు దిమ్మతిరిగేపోయే షాక్ ఇచ్చాడు. బరువు పూర్తిగా తగ్గి ఫిట్గా తయారయ్యాడు. హిమాన్షు కొత్త లుక్తో ట్రోలర్స్ నోట్లో వెలక్కాయ పడ్డట్లు అయింది. ఇక, హిమాన్షు కొత్త లుక్కు అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఓ అభిమాని హిమాన్షు ఫొటోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘‘ సడెన్గా చూసి కేటీఆర్ అన్న అనుకున్నా’’ అంటూ కామెంట్ చేశాడు. ఇందుకు హిమాన్షు స్పందిస్తూ.. ‘‘ ఓ గొప్ప మనిషి నాతో ఓ సారి ఏమన్నాడంటే.. ‘‘సర్లే ఎన్నెన్నో అనుకుంటాం.. అన్ని జరుగుతాయా ఏంటి?.. జోకులు పక్కన పెడితే.. థాంక్యూ ’’ అని అన్నాడు.