ఆ తల్లి కడుపారా నలుగురు పిల్లల్ని కన్నది. ఉన్నతంతో బిడ్డల్ని బాగా చూసుకుంది. తండ్రి తన రెక్కలు ముక్కలు చేసుకుని.. పిల్లలని పెంచి పోషించాడు. అందరికి పెళ్లిల్లు చేసి.. బాధ్యతలు తీర్చుకున్నాడు. ఏళ్ల తరబడి అవిశ్రాంతింగా పని చేసిన రెక్కలకు కాస్త విశ్రాంతి ఇచ్చి.. అవసాన దశలో కన్న బిడ్డల దగ్గర ప్రశాంతంగా కాలం వెళ్లదీయాలనుకున్నారు. కానీ ఆ ఆశ అడియాసే అయ్యింది. తమ కోసం జీవితాన్ని త్యాగం చేసి.. రెక్కలు ముక్కలు చేసుకున్న తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టడానికి ఆ నలుగురు బిడ్డలకు చేతులు రాలేదు. దాంతో అవసాన దశలో విశ్రాంతిగా గడపాల్సిన ఆ పండుటాకులు పట్టెడన్న కోసం చెత్త కాగితాలు ఏరుకుంటూ బతుకీడుస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో.. ఆ పని కూడా లేక.. తిండి లేక పస్తుంలుంటున్నారు. దాంతో ఆ వృద్ధ జంట అనారోగ్యం పాలైంది. నలుగురు బిడ్డలుండి కూడా అనాథలైన ఆ వృద్ధ జంట వ్యధ ప్రతి ఒక్కరిని కండతడి పెట్టిస్తోంది. ఆ వివరాలు..
పైన ఫోటోలో.. రిక్షా లాగుతున్న వృద్ధుడి పేరు రాములు. అనారోగ్యంతో పడుకుని ఉన్న ఆ మహిళ రాములు భార్య. వీరికి నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరికి వివాహాలు అయ్యి.. ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. దాంతో రాములు దంపతులును పట్టించుకోవడం మానేశారు. స్వగ్రామంలో వీరికి సొంత ఇల్లు కూడా లేదు. దాంతో హనుమకొండలో చిత్తు కాగితాలు ఏరుకుని విక్రయిస్తూ జీవితం సాగిస్తున్నారు.
అయితే గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా చిత్తు కాగితాలు ఏరుకునే పని కూడా కరువయ్యింది. దాంతో గత వారం రోజులుగా ఆ వృద్ధులు ఆదుకునే వారు లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఈ క్రమంలో రామలు భార్య అనారోగ్యం పాలయ్యింది. దాంతో భార్యను ఇలా రిక్షాలో ఎక్కించుకుని కాజీపేట ఆస్పత్రికి తీసుకెళ్తున్నాడు. తనకు ఇద్దరు కుమార్తెలు, కుమారులు ఉన్నా.. వారంతా దూర ప్రాంతంలో ఉండటంతో.. తమ బాగోగులు చూసేవారు ఎవరు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధుల దయనీయ పరిస్థితిపై విచారం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ దయనీయ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.