దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితికి ఎంతో ప్రత్యేకత ఉంది. చిన్నా పెద్దా అంతా కలిసి అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు. పార్వతీ- పరమేశ్వరుల కుమారుడు వినాయకుడి జన్మదినాన్నే వినాయక చవితిగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు ఆ బొజ్జ గణపయ్యను భక్తి శ్రద్ధలతో పూజించి.. తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. ఈ నవ రాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
ఆ గణేశ్ ఉత్సవాలకు భాగ్యనగరం కూడా ముస్తాబైంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో మండపాలు గణనాథుడి విగ్రహాలతో కళకళలాడుతున్నాయి. అందరి హడావుడి చూస్తుంటే అప్పుడే పండుగ మొదలైపోయిందనే భావన కలుగుతోంది. భాగ్యనగరంలో జరిగే గణేశ్ ఉత్సవాల్లో ఖైరతాబాద్ ఎంతో ఫేమస్.. ఆ తర్వాత అంతా రాంనగర్ గురించే మాట్లాడుకుంటారు. రాంనగర్ గణనాథుడు కూడా ఉత్సవాలకు ముస్తాబైపోయాడు.
త్రివర్ణ పతాక వెలుగుల్లో.. మంగళహారతులతో రాంనగర్లో గణనాథుడికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. నిజానికి అది వెల్కమ్ అంటే ఎవరూ నమ్మరేమో. నిమజ్జనం రోజు జరిగే ఊరేగింపులాగా ఎంతో అట్టహాసంగా చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఈ ఉత్సవాల్లో మరో ప్రత్యేకత కూడా ఉంది.
ఈ ఉత్సవాలను ఏటా తెరాస యూత్ లీడర్ సిద్దిఖ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటారు. ఒక ముస్లిం మైనారిటీ యువకుడు సిద్దిఖ్ ఏటా ఇంత గ్రాండ్గా గణేశ్ ఉత్సవాలు నిర్వహించడం.. మన దగ్గర ఉండే మత సామరస్యానికి ప్రతీక అంటూ కొనియాడుతున్నారు. మరి.. రాంనగర్లో బొజ్జ గణపయ్యకు చెప్పిన గ్రాండ్ వెల్కమ్ వీడియో చూసేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.