యువతీ యువకులు ప్రేమలో పడి.. ఆ ప్రేమను పరిణయంగా మార్చుకోవాలని భావిస్తారు. తమ ప్రేమను ఇంట్లో చెబుతారు. ఒప్పుకుంటే పెద్దల సమక్షంలో లేదంటే పారిపోయి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తమ మాటను కాదని వేరొకర్ని అందులో కులాంతర వివాహాన్నిచేసుకోవడాన్ని పెద్దలు సహించలేకపోతున్నారు
‘ప్రేమంటే ఏమిటంటే పక్కాగా చెప్పమంటే ఎట్టాగ చెప్పేదీ మామ’అన్నట్లు నిజంగా ప్రేమకు అర్థం అనిర్వచనీయం. ఏ వ్యక్తిపై, ఏ సమయంలో, ఏ ప్రాంతంలో, ఎందుకు పుడుతుందో చెప్పడం కష్టం. యువతీ యువకులు ప్రేమలో పడి.. ఆ ప్రేమను పరిణయంగా మార్చుకోవాలని భావిస్తారు. తమ ప్రేమను ఇంట్లో చెబుతారు. ఒప్పుకుంటే పెద్దల సమక్షంలో లేదంటే పారిపోయి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే పిల్లలు తమ మాటను కాదని వేరొకర్ని అందులో కులాంతర వివాహాన్నిచేసుకోవడాన్ని సహించలేకపోతున్నారు పెద్దలు. తమ పరువు పోయిందని, ప్రతిష్ట దిగజారిందని కడుపున పుట్టిన బిడ్డలను వేలేస్తున్నారు. ఇక మాటలే కాదూ, మొహలు కూడా చూడటం లేదు.
అయితే ఇటీవల కాలంలో ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయిన కుమార్తెల పట్ల తల్లిదండ్రులు కాఠిన్యంగా వ్యవహరిస్తున్నారు. అమ్మాయి ప్రేమ పెళ్లి పేరిట కులాంతర వివాహం చేసుకుందని తల్లిదండ్రులు.. ఆమెకు బతికుండగానే కర్మకాండలు చేసిన ఘటనలు ఇటీవల చూశాం. ఇప్పుడు మరో తండ్రి కూడా తన కుమార్తె చనిపోయిందంటూ శ్రద్ధాంజలి ఘటిస్తూ పోస్టర్లను వేయించారు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గిరిషమ్మ,ముకన్న దంపతుల కుమార్తె సోమేశ్వరి డాక్టర్ విద్యను అభ్యసించింది. ఆమె..కానిస్టేబుల్ రాజశేఖర్ను ప్రేమించింది. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పింది.
వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో సోమేశ్వరి, రాజశేఖర్ పెద్దలు ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుందన్న మనస్థాపంతో తండ్రి ఘోరమైన శిక్ష వేశాడు. కోపంతో ఆమె చనిపోయిందంటూ శ్రద్ధాంజలి ఘటిస్తూ పోస్టర్లను తయారు చేయించి.. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ నెల 2వ తేదీన ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తున్నానని, మా స్వగ్రామంలో నిర్వహిస్తున్నట్లు అందులో పేర్కొన్నాడు. ఆమె ఆత్మకు శాంతి చేకూరుస్తాడు అని ఉంది. దీంతో తమకు ప్రాణ హాని ఉందంటూ సోమేశ్వరి దంపతులు పోలీసులను ఆశ్రయించారు.