సాంకేతికత వినియోగం భారీగా పెరిగిన ఈ 21వ శతాబ్దంలో కూడా కొంతమంది ప్రజలు మూఢనమ్మకాలను వదలడం లేదు. దీనినే కొందరు కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. అమాయకులు కనిపిస్తే చాలు.. వారిని మాయమాటలతో మోసం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్లో చోటుచేసుకుంది.
టెక్నాలజీ వినియోగం, అక్షరాస్యత పెరిగిన ఈ హైటెక్ యుగంలో కూడా కొందరు ప్రజలు మూఢనమ్మకాలను వదలడం లేదు. ఇంకా అంధ విశ్వాసం ముసుగులో మగ్గిపోతూనే ఉన్నారు. దీన్నే కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. అమాయకుల జీవితాలతో కొందరు మోసగాళ్లు ఆటలాడుతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని వాడుకుని వారి దగ్గర నుంచి భారీగా డబ్బులను దోచుకుంటున్నారు. తాజాగా భూతవైద్యం పేరుతో ఓ దొంగబాబా.. అమాయక యువతుల్ని లోబర్చుకున్నాడు. అంతేకాదు.. ఏకంగా ఏడు మంది అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. ఆఖరికి మోసం బయటపడటంతో పోలీసుల చేతికి చిక్కాడు. ఈ ఘటన తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. హైదరాబాద్లోని లంగర్ హౌస్లో ఒక దొంబ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు.
భూతవైద్యం పేరుతో ఈ దొంగ బాబా ఏకంగా 7 వివాహాలు చేసుకున్నాడు. తన దగ్గరకు వచ్చే అమాయకులైన యువతులను దెయ్యం పట్టిందనే నెపంతో లోబర్చుకోవడంలో ఈ బాబా దిట్ట. మాయమాటలు చెప్పి వారిని మోసం చేసేవాడు. ఈ క్రమంలో ఏడుగురు అమ్మాయిలను వివాహం కూడా చేసుకున్నాడు. ఇలా మాయమాటలు చెప్పి మరో యువతిని ముగ్గులోకి దింపాడు. ఆమెను కూడా పెళ్లి చేసుకుని మోసం చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ దొంగ బాబా పెళ్లికి ఆహ్వానితులుగా 200 మంది బంధువులు, మిత్రులు రావడం గమనార్హం. అయితే ఆఖరి నిమిషంలో బాబా బాగోతం కాస్తా బట్టబయలైంది. దీంతో అతడి పెళ్లి రద్దయింది. అంతేకాదు ఆ బాబాకు పక్క రాష్ట్రంలోని బడా రాజకీయ నాయకుల అండ కూడా ఉందని సమాచారం. ప్రస్తుతం లంగర్ హౌస్ పోలీసుల అదుపులో ఉన్నాడీ బాబా. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.