తెలంగాణలో కరోనాతో మూత పడ్డ విద్యాసంస్థలను తెరిచేందుకు తెలంగాణ విద్యాశాఖ పూర్తి కసరత్తు చేస్తోంది. కరోనా సెకండ్ కారణంగా విద్యాసంస్థలకు తాళం వేసింది తెలంగాణ సర్కార్. దీంతో కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం చేయటంతో కేసుల సంఖ్య కాస్త తగ్గింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ను వెత్తేసి అన్ని వ్యాపార సముదాయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా దిగువకు చేరుకుంటూ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో లాక్డౌన్ కాలంలో విద్యార్థులకు అన్లైన్ తరగుతులు నిర్వహిస్తూ నెట్టుకొస్తోంది. దీంతో పెద్దగా ప్రయోజనం లేకపోవటంతో మళ్లీ పాఠశాలలు, విద్యాసంస్థలు తెరవాలని విద్యాశాఖ సీఎం కేసీఆర్కు ప్రతిపాదనలు పంపింది. ఇక విద్యాశాఖ పంపిణ ప్రతిపాదనలో మాత్రం విద్యాసంస్థలను వచ్చే నెల 1నుంచి 8 తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని సూచించింది. దీనిపై తొందరలోనే సీఎం నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. దీంతో పాటు థర్డ్ వేవ్ అంటూ మరోసారి కరోనా విరుచుకుపడనుందన్న వార్తలు కూడా లేకపోలేదు.
ఇక వీటన్నిటి మధ్య విద్యాసంస్థలు తెరవకపోవటంతో విద్యార్థుల జీవితాలు అయోమయంలోకి నెట్టుకెళ్తున్నాయి. థర్డ్ వేవ్ రానుందని తెలియటంతో తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపాల వద్దా అనే దానిపై కూడా నిర్ణయం తీసుకోలేక సతమతమవుతున్నారు. దీంతో మొత్తానికి ఎన్నో నెలలుగా మూతపడ్డ విద్యాసంస్థలను తెరిచేందుక అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నాయి. మరి ఇంతకు ఇప్పటి పరిస్థితుల్లో విద్యాసంస్థలను తెరవటం కరెక్టేనా అనేది కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.