తెలంగాణలో గత మూడు రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. రోడ్లపై వాహనాలు నడవాలన్నా ఎంతో కష్టంగా ఉంది. వర్షాల కారణంగా రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న కొన్ని సమస్యలపై జగన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
“దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది” అన్న వివేకానందుడి మాట అక్షరాల నిజం. దానికి తగ్గట్టుగానే.. దేశంలో ఎందరో ప్రతిభావంతమైన విద్యార్థులు ఉన్నారు. వారి వారి ప్రతిభను ఉపయోగించి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇలా అద్భుతాలు సృష్టించే క్రమంలో కొందరు విద్యార్థులకి ఆర్థిక స్థోమత సరిపోక తమ రీసెర్చ్ లను మధ్యలోనే ఆపేస్తున్నారు. అలాంటి వారికి ప్రభుత్వాలు అండగా నిలుస్తున్న మాట వాస్తవమే. ఇక ఇలాంటి ప్రతిభగల యువతకు సాయం చేయడానికి దేశంలోని కొన్ని కార్పోరేట్ సంస్థలు కూడా […]
విద్యార్థి సంఘాల బంద్ పిలుపు నేపథ్యంలో రేపు తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూతపడనున్నాయి. ఈ మేరకు అన్ని విద్యాసంస్థలు బంద్ కు సహకరించాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఏపీలో విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా బంద్ కు పిలుపునివ్వగా, తెలంగాణలో ఇంటర్ కాలేజీల బంద్ కు ఏబీవీపీ పిలుపు నిచ్చింది. రాష్ట్రంలో ఇంటర్ విద్యలో కార్పొరేట్ కళాశాలలను ప్రభుత్వ నియంత్రించడం లేదంటూ ఏబీవీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ మేరకు నారాయణగూడలోని శ్రీ చైతన్య జూనియర్ […]
కరోనా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా విద్యార్థులకు జనవరి 8 నుంచి జనవరి 16 వరకు సెలవులు ప్రకటించింది. కానీ కరోనా కేసులు పెరిగిపోతూ ఉండటంతో సెలవులను జనవరి 31 వరకు పొడిగిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జనవరి 31తో స్కూళ్లకు సెలవులు ముగియనున్నాయి. అయితే కరోనా కేసుల తగ్గుదల, తీవ్రత లేకపోవడతో తిరిగి విద్యాసంస్థలను ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకూ […]
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఒక వైపు కరోనా, మరో వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చాపకింది నీరులా వ్యాపిస్తుంది. కరోనా ఎఫెక్ట్ గత ఏడాధి విద్యా వ్యవస్థపై తీవ్రంగా పడిన విషయం తెలిసిందే. స్కూల్స్, కాలేజీలు మూత పడటంతో ఆన్లైన్ క్లాసులతో సరిపెట్టుకున్నారు విద్యార్థులు. అయితే ఆన్ లైన్ క్లాసులతో విద్యార్థులకు పెద్దగా ఉపయోగం లేదని ఇటీవల వచ్చిన రిజల్ట్ ని బట్టి తెలిసిందని […]
ఇటీవల కాలంలో తమిళనాడులోని విద్యాసంస్థల్లో మహిళా టీచర్ల వస్త్రలంకరణపై వివాదం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. అయితే ఈ విషయంపై తమిళనాడు సర్కార్ కూడా తప్పనిసరికాదంటూ గతంలో అనేకసార్లు వివరణ కూడా ఇచ్చింది. అయితే ఈ క్రమంలోనే మహిళా టీచర్లు తప్పనిసరిగా ప్రతి రోజు చీర ధరించాల్సిందే అంటూ విద్యాసంస్థల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే మహిళా ఉపాధ్యాయులంతా విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీనిపై స్పందించిన మంత్రి బిందు కేరళ […]
తెలంగాణలో కరోనాతో మూత పడ్డ విద్యాసంస్థలను తెరిచేందుకు తెలంగాణ విద్యాశాఖ పూర్తి కసరత్తు చేస్తోంది. కరోనా సెకండ్ కారణంగా విద్యాసంస్థలకు తాళం వేసింది తెలంగాణ సర్కార్. దీంతో కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం చేయటంతో కేసుల సంఖ్య కాస్త తగ్గింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ను వెత్తేసి అన్ని వ్యాపార సముదాయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా దిగువకు చేరుకుంటూ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ కాలంలో విద్యార్థులకు […]
కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్ అంటూ విద్యార్థుల జీవితాలు నాశనమవుతూనే ఉన్నాయి. దాదాపుగా ఏడాదిన్నరకు పైగా కరోనాతో విద్యాసంస్థలన్నీ మూత పడ్డాయి. పాఠశాలల నుంచి కాలేజీల వరకు అన్ని రకాల విద్యాసంస్థలకు తాళం పడిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు కాస్త చదువుకు దూరమయ్యారు. ఆన్లైన్ క్లాసులంటూ మొదలుపెట్టిన వాటితో అంతాగా ప్రయోజనం లేదంటూ ఏకంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మొర పెట్టుకుంటున్నారు. ఇక కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు […]