తెలంగాణలో గత మూడు రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. రోడ్లపై వాహనాలు నడవాలన్నా ఎంతో కష్టంగా ఉంది. వర్షాల కారణంగా రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
తెలంగాణలో మొన్నటి వరకు ఎండలు దంచికొట్టాయి. గత వారం రోజుల నుంచి వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. ఇక మూడు రోజులు నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు కాలనీలు పూర్తిగా జలమయం అయ్యాయి.. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు గురువారం, శుక్రవారం సెలవు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కాగా, వరుస సెలవులు కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. వివరాల్లోకి వెళితే..
గత మూడు రోజుల నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ విషయం స్వయంగా తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి ట్విట్టర్ తెలిపారు. అప్పటికే విద్యార్థులు స్కూల్స్ వెళ్లిపోయారు. తర్వాత స్కూల్స్ కి సెలవు ప్రకటించడంతో విద్యార్థులకు తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. తెలంగాణలో స్కూల్స్ కి మాత్రమే కాదు జూనియర్ కాలేజ్ లకు కూడా సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు రోజుల పాటు జూనియర్ కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. దీంతో రాష్ట్రంలో జరగవలసిన పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి.
రాష్ట్రంలో మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రకటించింది. వాస్తవానికి గురువారం, శుక్రవారం పరీక్షలు జరగాల్సి ఉంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు జరుగుతున్నాయి. వరుసగా కురుసున్న వర్షాల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను త్వరలో వెల్లడిస్తామని యూనివర్సిటీ ప్రకటించింది. అంతేకాదు ఉస్మానియా యనివర్సిటీ కూడా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. పరీక్ష రీషెడ్యూల్ ను ఓయూ వెబ్ సైట్ లో పోస్ట్ చేస్తామని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.