కరోనా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా విద్యార్థులకు జనవరి 8 నుంచి జనవరి 16 వరకు సెలవులు ప్రకటించింది. కానీ కరోనా కేసులు పెరిగిపోతూ ఉండటంతో సెలవులను జనవరి 31 వరకు పొడిగిస్తూ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. జనవరి 31తో స్కూళ్లకు సెలవులు ముగియనున్నాయి. అయితే కరోనా కేసుల తగ్గుదల, తీవ్రత లేకపోవడతో తిరిగి విద్యాసంస్థలను ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకూ 8,9,10 తరగతులకు కూడా ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహిస్తున్నారు. వీటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండటం లేదన్నది తల్లిదండ్రుల అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సెలవులు ముగియనుండటంతో విద్యాశాఖ స్కూళ్లను ప్రారంభించడం పై కసరత్తు చేసింది. వైద్య ఆరోగ్య శాఖతో కూడా సంప్రదింపులు జరిపారు.
తెలంగాణలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతున్న కారణంగా కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1 వ తేదీన స్కూళ్లను తిరిగి ప్రారంభించేందుకు సర్కార్ సిద్దమవుతున్నట్లు సమాచారం. స్కూళ్లు తెరిచిన తరువాత విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు పాటిస్తూ స్కూళ్లను ఓపెన్ చేశారు. విద్యాసంస్థలు మూసి వేయడం వల్ల విద్యార్థులు విలువైన విద్యకు దూరం అవుతున్నారు. మరోవైపు విద్యాసంస్థలు తెరవాలని విద్యార్థుల పేరెంట్స్ నుంచి ఒత్తిడి రావడం కూడా ఓ కారణమే. అంతే కాదు పదవ తరగతి పరీక్షలు కూడా సమీపిస్తున్నందున పాఠశాలలు తెరవాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.