వర్షాకాలం వచ్చేసింది. రైతులకు చేతినిండా పని మొదలైంది. సాగుకోసం భూమిని దున్ని విత్తనాలు వేసే సమయం వచ్చేసింది. ఆరుగాలం కష్టపడి సాగుచేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. పెట్టుబడి సాయంగా అన్నదాతలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతుబంధు సాయం ఇక వారి అకౌంట్లోకి రానున్నాయి.
వర్షాకాలం వచ్చేసింది. రైతులకు చేతినిండా పని మొదలైంది. సాగుకోసం భూమిని దున్ని విత్తనాలు వేసే సమయం వచ్చేసింది. ఆరుగాలం కష్టపడి సాగుచేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. పెట్టుబడి సాయంగా అన్నదాతలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతుబంధు సాయం ఇక వారి అకౌంట్లోకి రానున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో ‘రైతుబీమా, రైతుబంధు, 24 గంటలు ఉచిత కరెంటు..’పథకాలు రైతులకు సాయంగా ఉపయోగపడుతున్నాయి. తెలంగాణలో పండించిన వరిని పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు రైస్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఈ ధ్యేయంతో అన్నదాతలకు అండగా నిలుస్తుంది.
తెలంగాణలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు తెలియజేసింది. రైతుల అకౌంట్లలోకి ‘రైతుబంధు’ నిధులు జమ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సాయంగా రూ. 7,720 కోట్లు విడుదల చేశారు. ఈ సంవత్సరం కొత్తగా 5 లక్షల మంది రైతులకు ‘రైతుబంధు’ పథకాన్ని వర్తింప జేయనుంది. సుమారు రూ. 300 కోట్ల అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడే అవకాశం ఉంది. కొత్తగా రైతుబంధు పథకం సాయం తీసుకునే రైతులు.. తమ బ్యాంకు అకౌంట్ వివరాలతో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని అధికారులు తెలుపుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు ఆర్థికంగా అందిస్తున్న సాయం రైతుబంధు నిధులు నేడు విడుదల కానున్నాయి. వర్షాకాలం రైతుబంధు నిధులు జమ చేస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఏడాదికి రెండు విడతల్లో ఎకరాకు రూ.10 వేలు సాయం రైతులకు అందస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో రైతులకు రైతుబీమా, రైతుబంధు,24 గంటల ఉచిత కరెంటు, సాగునీటి సరఫరా అందజేస్తుంది.
బియ్యం సరఫరాపై కేంద్రం చేతులు ఎత్తేస్తే పొరుగు రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని.. మన రాష్ట్ర వ్యవసాయ విధానాలు దేశాన్ని ఆకర్షిస్తున్నాయని ఆయన తెలిపారు.