బుల్లితెరపై వస్తున్న రియాల్టీ షో లో బాగా పాపులర్ అయ్యింది బిగ్ బాస్. హిందీలో సల్మాన్ హూస్ట్ గా చేసిన బిగ్ బాస్ షో ఇప్పుడు పలు భాషల్లో వస్తుంది. తెలుగు లో బిగ్ బాస్ షో ఫస్ట్ సీజన్ కి ఎన్టీఆర్, రెండో సీజన్ కి నాని హూస్ట్ చేయగా ప్రస్తుతం మూడు సీజన్లకు కింగ్ నాగార్జున హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 నడుస్తుంది. ఇక బిగ్ బాస్ ఈ రియాల్టీ గేమ్ షో ఎంత అందరాని పొందిందో అంటే విమర్శలను కూడా ఎదుర్కొంటుంది. హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ శృతిమించుతున్నారు అంటూ ఇప్పటికే పలువురు ఆరోపిస్తూ వస్తున్నారు. అసలు ఈ గేమ్ షో వల్ల సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే సీపీఐ నారాయణ కోర్టులోకేసు కూడా వేశారు. ఆయన ఎప్పుడు బిగ్ బాస్ గేమ్ పట్ల వ్యతిరేకతను చూపుతూ వచ్చారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించారు. బిగ్బాస్ షోను బ్యాన్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో బిగ్ బాస్ గేమ్ షోను బ్యాన్ చేయాలి.. అసలు ఆ షోలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటూ ఫైర్ అయ్యారు. యాంకర్ రవిని బయటకు పంపడంలో ఏం జరిగిందనేది తెలియాలన్నారు. ఆ షోను తెలంగాణలో బ్యాన్ చేయాలని ఆయన కోరారు. ప్రశాంతంగా ఉన్న హైద్రాబాద్ లో ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్స్ తెచ్చి రెచ్చగొడ్తున్నారని రాజా సింగ్ ఆరోపించారు.
గత రాత్రి అన్నపూర్ణ స్టూడియో దగ్గర రచ్చరచ్చ చేసారు. అసలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ప్రజలకు ఏం మేసెజ్లు ఇస్తున్నారు.. అంటూ ప్రశ్నించారు. ఇక చిన్న పిల్లలు, మహిళలు బిగ్ బాస్ కంటెంట్ చూడలేకపోతున్నారని రాజా సింగ్ వ్యాఖ్యానించారు. బిగ్ బాస్ షోకి సైతం సెన్సార్ ఉండాల్సిందేనన్నారు. హిందూ దేవుళ్లను సయితం బిగ్ బాస్ షోలో అవమానపరుస్తున్నారని రాజా సింగ్ అన్నారు. దీనిపై కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.