సాధారణంగా ఇంటి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది. వందల్లోనో, లేదంటే… కాస్త ఎక్కువగా వినియోగిస్తే వేలలో వస్తుంటుంది. అదే, చిన్నపాటి దుకాణాలు, మెకానిక్ షెడ్లకు కమర్షియల్ బిల్లు పేరిట కాస్త సాధారణం కంటే ఎక్కువగానే వస్తుంటుంది. ఈ మద్య మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విద్యుత్ చార్జీల మోత మోగుతుంది. ఓ అపార్ట్ మెంట్ యజమానికి ఫిబ్రవరి నెలలో కరెంట్ బిల్లు షాక్ ఇచ్చింది. ఏకంగా 3కోట్ల,21లక్షల,05,218 బిల్లు రావడం తో యజమాని బిత్తరపోయాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ పట్టణానికి చెందిన బొల్లం నాగేశ్వరరావు కు చెందిన ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ 302 లో నెల నెల సర్వీసు ఛార్జీలు 175 రూపాయలు వచ్చేవి.
ఇది చదవండి:దూసుకొచ్చిన రైలు..! రెప్పపాటులో తప్పించుకున్న యువకుడు..వీడియో వైరల్!
ఒక్కసారి అంతకు మించి మహా అంటే రెండు వందలు. ఫిబ్రవరి 14న సిబ్బంది మీటర్ రీడింగ్ తీశారు. ఎక్కువ నమోదు కావడంతో ఆ వినియోగదారుడికి రూ. 3,21,05,218 బిల్లు వచ్చింది. అపార్ట్ మెంట్లో సంవత్సరం పైగా ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. అయినా ఇంత బిల్లు వచ్చే సరికి ఇంటి యజమాని సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ అపార్ట్ మెంట్ యజమాని సోదరుడు ఈ సమస్యను మీడియాకి తెలిపారు. ఏకంగా కోట్లలో బిల్లు రావడం పై విద్యుత్ అధికారుల పై స్థానికులు మండిపడుతున్నారు. సమాచారం తెలుసుకున్న విద్యుత్తు శాఖ అధికారులు వెంటనే సరిదిద్దారు. సాంకేతిక లోపంతో అధిక బిల్లు వచ్చిందని, తమ దృష్టికి రాగానే సరిచేయించినట్లు మహబూబాబాద్ ఈఆర్వో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ఎం.రమేశ్ తెలిపారు.