ఇంట్లో ఏ వస్తువు దొరికితే అది దోచేసే దొంగలు.. రోడ్డు మీద పడి ఉన్నదాన్ని మాత్రం వదిలేస్తారా. లటుక్కున మాయం చేసేందుకు సిద్దమవ్వుతుంటారు. ఏంటో అనేది పరిశీలించకుండా దోచేసుకుంటారు దొంగలు.
ఓ దొంగ చేసిన పని కొంత మంది కొంపల మీదకు తెచ్చి పెట్టింది. ఇంట్లో ఏ వస్తువు దొరికితే అది దోచేసే దొంగలు.. రోడ్డు మీద పడి ఉన్నదాన్ని మాత్రం వదిలేస్తారా. లటుక్కున మాయం చేసేందుకు సిద్దమవ్వుతుంటారు. ఏంటో అనేది పరిశీలించకుండా దోచేసుకుంటారు దొంగలు. దాని వల్ల ఎటువంటి ఆపద వస్తుందా అని చూడరు. ఊరికనే రోడ్డు మీద పడింది కదా అని దొంగిలించేందుకు ప్రయత్నించి.. ఆపద తెచ్చొడో దొంగ. అనేక మంది ప్రాణాల మీదకు తీసుకు వచ్చారు. అసలైమైందంటే.. హైదరాబాద్లోని సనత్ నగర్ పరిధిలోని ఫతే నగర్లో అమ్మోనియం గ్యాస్ సిలిండర్ లీకైంది. దీనికి ఓ దొంగ కారణమయ్యాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫతేనగర్లో పైప్ లైన్ రోడ్డు చివరన చెత్త కుప్పల్లో అమ్మోనియం సిలిండర్లు ఎప్పటి నుండో పడి ఉన్నాయి. అయితే ఈ సిలిండర్లు చూసిన ఓ దొంగ.. గ్యాస్ సిలిండర్లు అనుకుని.. సిలిండర్లకున్న ఇత్తడి వాల్వులు తీసుకునే ప్రయత్నం చేశాడు. అవి రాకపోవడంతో రాడ్డుతో కొట్టి దొంగలించబోయాడు. దీంతో ఒక్కసారిగా సిలిండర్ నుండి అమ్మోనియం గ్యాస్ లీకయ్యింది. దీంతో కంగారు పడ్డ దొంగ అక్కడ నుండి పారిపోయాడు. అయితే ఈ గ్యాస్ పొగలా వ్యాపించి.. సమీప ప్రాంతాలకు పాకింది. అక్కడే ఓ కంపెనీలో పనిచేస్తున్న పది మంది కార్మికులు గ్యాస్ పీల్చడంతో అస్వస్థతకు గురయ్యారు. అలాగే మరి కొందరు కళ్ల మంటలు, వాంతులు అయ్యాయి. వెంటనే వారిని బీబీఆర్ ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందించిన తరువాత డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు.